చెన్నై: ఒక చిన్నారి అనారోగ్యంతో మరణించింది. పోస్ట్మార్టం పరీక్షలో లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ బాలిక హత్యకు కారణమైన అధికార డీఎంకే యువజన విభాగం సభ్యుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. (DMK Youth Member Arrested) తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భర్త నుంచి విడిపోయిన మహిళతో అధికార పార్టీ డీఎంకే యువజన విభాగం సభ్యుడు పెరియనాయగం సహజీవనం చేస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్లో రెండున్నర ఏళ్ల వయస్సున్న ఆమె కుమార్తె తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రికి తరలించగా ఆ బాలిక మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా, ఆ చిన్నారి మరణంపై ఆమె తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాలిక మరణంపై దర్యాప్తు జరిపారు. చిన్నారి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించగా అంతర్గత గాయాలున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారిపై లైంగిక దాడి జరిపి హత్య చేశారన్న అనుమానాలు బలపడ్డాయి. అయితే ఫోరెన్సిక్ తుది నివేదిక కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.
మరోవైపు ఈ సంఘటన తమిళనాడు రాజకీయాల్లో దుమారం రేపింది. మహిళలు, పిల్లలపై నేరాలను అరికట్టడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంకే ఎదురుదాడి చేసింది.
కాగా, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార డీఎంకే యువజన విభాగం సభ్యుడైన పెరియనాయగంను పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతో పాటు హత్య సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నట్లు వివరించారు.
Also Read:
IAS Officer Suspended | మంత్రి సమావేశాలకు గైర్హాజరు.. ఐఏఎస్ అధికారి సస్పెండ్
Couple’s Marriage Lasted Few Hours | పెళ్లైన కొన్ని గంటల్లోనే విడిపోయిన జంట.. ఎందుకంటే?
Watch: బావిలో పడిన మేక పిల్ల.. కాపాడేందుకు సాహసం చేసిన బాలుడు