బంజారాహిల్స్,ఆగస్టు 5: కరెంట్ షాక్తో విద్యుత్శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాకు చెందిన రంగనాయకులు(39) రహ్మత్నగర్లో నివాసం ఉంటూ టీఎస్పీడీసీఎల్ యూసుఫ్గూడ సెక్షన్లో ఆర్టిజన్గా పనిచేస్తుంటాడు. బుధవారం ఉదయ కమలాపురి కాలనీలోని లోటస్ డిలైట్ అపార్ట్మెంట్ వద్ద కరెంట్ సరఫరాలో సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదు రావడంతో రంగనాయకులు అక్కడకు వచ్చాడు. ట్రాన్స్ఫార్మర్ వద్ద పరీక్షిస్తుండగా షాక్ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.