భోపాల్: ఒక కార్గో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కారును కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. కారులో ఉన్న వారు ప్రాధేయపడినప్పటికీ పట్టించుకోలేదు. చివరకు స్థానికులు ఆ లారీని అడ్డుకున్నారు. ఆ డ్రైవర్ను చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. (Truck Drags Car) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బజేరా గ్రామం సమీపంలోని డాబ్రా- గ్వాలియర్ జాతీయ రహదారిపై రాజస్థాన్కు చెందిన కార్గో లారీ వెళ్తున్నది. రోడ్డు పక్కగా అడ్డంగా ఆగి ఉన్న మధ్యప్రదేశ్కు చెందిన కారును ఢీకొట్టింది. ఆ తర్వాత సుమారు 1.5 కిలోమీటర్ల దూరం వరకు ఆ కారును లారీ ఈడ్చుకెళ్లింది.
కాగా, ఆ కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సహాయం కోసం అరిచారు. లారీని ఆపాలని డ్రైవర్ను వేడుకున్నారు. ఒక వ్యక్తి బైక్పై ఆ లారీని వెంబడించాడు. లారీని నిలుపాలని డ్రైవర్కు చెప్పినప్పటికీ అతడు పట్టించుకోలేదు. చివరకు రోడ్డు పక్కన ఉన్న గుంత వైపు కారును తోసి పారిపోయేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు.
మరోవైపు బిలావా ప్రాంతంలో స్థానికులు ఆ లారీని అడ్డుకున్నారు. డ్రైవర్పై మూకుమ్మడిగా దాడి చేసి కొట్టారు. పోలీసులు అక్కడకు చేరుకోగా ఆ డ్రైవర్ను అప్పగించారు. కారులో ప్రయాణిస్తున్న వారిలో స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్స్ అధికారి కూడా ఉన్నట్లు సమాచారం. ఆ లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే కారును లారీ ఈడ్చుకెళ్లిన షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Truck Drags Car For 1.5 Km On Dabra – Gwalior Highway, Passengers Escape Unhurt; Incident Caught On Camera #MPnews #MadhyaPradesh pic.twitter.com/zUQu3qUyvG
— Free Press Madhya Pradesh (@FreePressMP) March 1, 2026
Also Read:
Bengaluru techie dies by suicide | వివాహం విఫలమవుతుందన్న జ్యోతిష్కుడు.. టెకీ ఆత్మహత్య
Watch: డీజే ఆపేయడంపై గొడవ.. హింసాత్మకంగా మారిన ఘర్షణ