న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్లో బంగారం, వెండి ధరలు ధగధగలు కొనసాగుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికల్లా తులం బంగారం ధర రూ.57 వేలు పలుకుతుందని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర మెహతా చెప్పారు.
తాజాగా 10 గ్రాముల బంగారం ధర మరోమారు రూ.49 వేల మార్క్ను దాటేసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో సోమవారం మధ్యాహ్నం తులం బంగారం ధర రూ.49,323 వద్ద ట్రేడైంది. అదే సమయంలో ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ వెబ్సైట్లో మాత్రం తులం బంగారం ధర రూ.48,975 అని చెబుతున్నది.
మరోవైపు కిలో వెండి ధర రూ.71,575లకు చేరుకున్నది. ఈ నెలలో తులం బంగారం ధర రూ.2,184 పెరిగితే, కిలో వెండి ధర రూ.3,570 ఎక్కువైంది. ఏప్రిల్ 30న పది గ్రాముల బంగారం ధర రూ.46,791 పలికితే, ఇప్పుడు రూ.48,975 వద్ద స్థిరపడింది.
కిలో వెండి ధర గత నెల 30న రూ.67,800 పలికితే, ఇప్పుడు అది రూ.71,370కి చేరుకున్నది. ఏప్రిల్లో తులం బంగారం ధర రూ.2,601 పెరిగితే, కిలో వెండి ధర రూ.4,938 ఎక్కువైంది.
ఈ ఏడాది చివరి కల్లా ఔన్స్ బంగారం ధర 2200 డాలర్లకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1905 డాలర్లు పలికింది. ఈ నెల ప్రారంభంలో అది 1780 డాలర్లకే పరిమితమైంది.
కరోనా మహమ్మారి ప్రభావంతో దేశంలో ద్రవ్యోల్భణం శరవేగంగా పెరిగింది. ఏప్రిల్లో ఖర్చులు పెరిగి పోవడంతో హోల్సేల్ ద్రవ్యోల్బణం 11 ఏండ్ల గరిష్ఠానికి పెరిగి 10.49 శాతానికి పెరిగింది. గత మార్చిలో అది 7.39 శాతం మాత్రమే. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా బంగారం ధర పైపైకి దూసుకెళ్లింది.
అన్ని రకాల క్రిప్టో కరెన్సీ లావాదేవీలు, సర్వీసులపై చైనాలోని ఆర్థిక సంస్థలు, పేమెంట్ సంస్థలు నిషేధం విధించాయి. చైనా సర్కార్ సైతం హెచ్చరించడంతో మదుపర్లు బంగారం వైపు మళ్లారని తెలుస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీన పడటం కూడా బంగారం పుంజుకోవడానికి మరో కారణం.
చైనాతోపాటు పలు దేశాల నియంత్రణ చర్యలు, ఇంటర్నేషనల్ కార్పొరేట్ సంస్థల సలహాలతో క్రిప్టో కరెన్సీలపై లావాదేవీలు బంగారం వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయి. బంగారం దిగుమతికి చైనా బ్యాంకులు ఆమోదం తెలిపితే, గోల్డ్, వెండి ధరలు మరోదఫా పైపైకి దూసుకెళ్లొచ్చు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
కరోనా ఉన్నా రెండంకెల్లో దేశ జీడీపీ వృద్ధి.. ఆర్థికవేత్తల అంచనా
ముంబైలో కొత్త బంగ్లా కొన్న అజయ్ దేవగన్
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
సిగరెట్ స్మోకింగ్తో ఆరోగ్య సమస్యలు ఎన్నో..!
మువ్వన్నెల జెండాకు కాంగ్రెస్ గుర్తింపు.. చరిత్రలో ఈరోజు
వానాకాలం కరోనా వైరస్తో జాగ్రత్త.. ఇవి పాటించండి..!
రేపట్నుంచి బ్యాంకుల పని వేళల్లో మార్పు
ఐటీ రూల్స్: ఫిర్యాదుల స్వీకరణకు సోషల్ మీడియా ఏర్పాట్లు!
చిన్న వ్యాపారులకు రిలీఫ్.. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ!
ఎస్బీఐ vs యాక్సిస్ vsహెచ్డీఎఫ్సీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా..
కరోనా వేళ కస్టమర్లకు ఎస్బీఐ రిలీఫ్.. అదేంటంటే!!
మోదీ సర్కార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : సచిన్ పైలట్
జూన్ 20 తర్వాత స్పుత్నిక్ వీ టీకాల తొలి బ్యాచ్ రాక
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
రెండు వేర్వేరు డోసులు తీసుకుంటే ఎలా ? వ్యాక్సిన్ మిక్సింగ్పై త్వరలో స్టడీ
కరోనా చికిత్స: రూ.5 లక్షల వరకు అన్సెక్యూర్డ్ లోన్లు!
ఐసోలేషన్ కేంద్రంతో నిరుపేదలకు మేలు