ముంబై : ‘సింఘం’ ఫేం అజయ్ దేవగన్ ముంబైలో కొత్త బంగ్లా కొనుగోలు చేశారు. 5310 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బంగ్లాను రూ.60 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
కరోనా మహమ్మారి ఉద్ధృతి మధ్యలో కూడా బాలీవుడ్ సెలబ్రిటీలు నిరంతరం ఆస్తిపై పెట్టుబడులు పెడుతున్నారు. జాన్వి కపూర్, అర్జున్ కపూర్, హృతిక్ రోషన్, అలియా భట్, అమితాబ్ బచ్చన్ తర్వాత ఇప్పుడు బాలీవుడ్ ‘సింఘం’ గా ప్రసిద్ది చెందిన అజయ్ దేవగన్ ముంబైలో కొత్త బంగ్లాను కొనుగోలు చేశారు. జుహు ప్రాంతంలో ఇప్పుడు నివసిస్తున్న ఇంటికి సమీపంలోనే ఈ బంగ్లా ఉన్నది. అజయ్ దేవ్గన్ ప్రతినిధి కొత్త ఆస్తిని కొనుగోలు చేసిన వార్తలను ధ్రువీకరించారు. అయితే, బంగ్లా ధర గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ రియల్ ఎస్టేట్ వర్గాల ప్రకారం.. దీని విలువ దాదాపు రూ.60 కోట్లుగా ఉండనున్నది.
గత ఏడాది కాలంగా అజయ్ కొత్త బంగ్లా కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్తున్నారు. గత ఏడాది నవంబర్లో అతను కపోల్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో బంగ్లా కోసం ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాడు. ఈ నెల 21న అజయ్ దేవగన్, అతడి తల్లి వీణ వీరేంద్ర దేవగన్ పేరిట ఆస్తి పత్రాలను బదిలీ చేయగా.. పునరుద్ధరణ పనులను కూడా ప్రారంభించాడని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
‘సూర్యవంశీ’, ‘గంగూబాయి కాతివాడి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘మైదాన్’, ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’, ‘థాంక్స్ గాడ్’ ‘మే డే’ సినిమాల్లో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. ‘మే డే’ దర్శకుడు, నిర్మాత కూడా అజయ్ వ్యవహరిస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
సిగరెట్ స్మోకింగ్తో ఆరోగ్య సమస్యలు ఎన్నో..!
మువ్వన్నెల జెండాకు కాంగ్రెస్ గుర్తింపు.. చరిత్రలో ఈరోజు
జూలై 4 నుంచి ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా పీడీఎం దేశవ్యాప్త ఆందోళన
బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆకర్శణీయమైన డిజైన్
ఎల్ఓసీపై 3 నెలలుగా ఒక్క బుల్లెట్ పేలలేదు : జనరల్ ఎంఎం నరవణె
వానాకాలం కరోనా వైరస్తో జాగ్రత్త.. ఇవి పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..