న్యూఢిల్లీ : జర్మనీ వాహన తయారీదారు బీఎండబ్ల్యూ అభిమానులు ఆ కంపెనీ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణ త్వరలో ముగియనున్నట్లుగా తెలుస్తున్నది. జర్మనీలో పరీక్ష సమయంలో బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈ 04 గుర్తించారు. వీటి ఫొటోలను పలువురు నెటిజెన్లు ఆన్లైన్లో పంచుకున్నారు. అయితే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అందిన సమాచారం మేరకు, ఎలక్ట్రిక్ స్కూటర్ గత ఏడాది నవంబర్లో జరిగిన ఐఐసీఎంఏ మోటార్ షోలో ప్రవేశపెట్టిన బీఎండబ్ల్యూ డెఫినిషన్ సీఈ 04 కాన్సెప్ట్ ఆధారంగా ఉంటుంది. స్కూటర్ రూపకల్పన కాన్సెప్ట్ వెర్షన్తో చాలా పోలి ఉన్నట్లుగా ఇటీవలి ఫొటోలు చూపిస్తున్నాయి. అయితే, డిజైన్లో కొన్ని అందానికి సంబంధించిన మార్పులు చేసినట్లుగా తెలుస్తున్నది.
డిజైన్ బ్లాగ్స్పాట్ వెబ్సైట్ షేర్ చేసిన ఫొటోల ప్రకారం.. బీఎండబ్ల్యూ సీఈ-04 కు స్టైలిష్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఇవ్వబడింది. ముందు భాగంలో ఇది వీ- ఆకారపు ఎల్ఈడీ హెడ్ల్యాంప్ ఉన్నది. స్కూటర్ డ్రైవింగ్ వైఖరి క్రూయిజర్ బైక్ను పోలి ఉన్నట్లుగా కనిపిస్తున్నది. ఈజీగా నడిపించేందుకు వీలుగా ముందుకు వంగి ఉండేలా హ్యాండిల్బార్ను అమర్చారు.
ఈ సంస్థ 120 నుంచి 130 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్తో జర్మనీలో ఈ స్కూటర్ను విడుదల చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు సీఈ-04 శ్రేణిని పరీక్షిస్తుండగా తీసిన ఫొటోలు అభిమానులను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి.
నేతలు కావాలన్న ఆతృతలో మిగిలిపోతున్న రైతు సమస్యలు: సర్దార్ వీఎం సింగ్
ఎల్ఓసీపై 3 నెలలుగా ఒక్క బుల్లెట్ పేలలేదు : జనరల్ ఎంఎం నరవణె
వానాకాలం కరోనా వైరస్తో జాగ్రత్త.. ఇవి పాటించండి..!
ఎల్లుండి నుంచి ఎంపీలో అన్లాక్ : మార్గదర్శకాలు వెల్లడి
ఆరేండ్ల క్రితం కేసులో హైకోర్టు తీర్పు.. ధర్మసంకటంలో పినరాయి ప్రభుత్వం
తొలి హిందీ వార్తాపత్రిక ప్రారంభం.. చరిత్రలో ఈరోజు
చైనాలో కలవరపెడుతున్న కొత్త రకం స్ట్రెయిన్
లెఫ్టినెంట్గా బాధ్యతలు చేపట్టిన పుల్వామా వీరుడి సతీమణి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..