బీజింగ్ : చైనాలో కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి పెరుగుతున్నది. వైరస్ కట్టడి చేశామని ఆనందించేలోపే.. కొత్త రకం స్ట్రెయిన్ నమోదు కావడంతో కలవరానికి గురవుతున్నారు. చైనాలోని గాంజావ్ నగరంలో 16 కి పైగా కేసులు నమోదవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. గాంజావ్ నగరంలో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎవరూ గడప దాటి రావొద్దని ఆంక్షలు విధించింది.
కోటిన్నర జనాభా ఉన్న గంజావ్ నగరంలో గత వారం రోజులుగా 16 కేసులు నమోదవడం అధికారుల కలవరానికి కారణమవుతున్నది. గత వేరియంట్ల కంటే ఇప్పుడు నమోదువుతున్న వైరస్ మరింత ప్రమాదకరమైనదని, ఉద్ధృతంగా ఉన్నదని చైనా అధికారులు వెల్లడించినట్లు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. కొత్త వేరియంట్ను కనుగొనేందుకు లివాన్ జిల్లాలో పరీక్షలకు ప్రభుత్వం శనివారం ఆదేశించింది. జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో పరీక్షలు జరుపనున్నారు. లివాన్ పరిసరాల్లో నాలుగు జిల్లాల్లో బహిరంగ కార్యక్రమాలు జరుగకుండా చూడాలని ఆదేశించారు. బహిరంగ మార్కెట్లు, శిశు సంరక్షణ కేంద్రాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, రెస్టారెంట్లపై నిషేధం విధించారు. చైనాలో గత కొన్నిరోజులుగా నిత్యం కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్త కేసులు నమోదు చేస్తున్న వారంతా విదేశాల నుంచి వస్తున్నవారే కావడం గమనార్హం.
లెఫ్టినెంట్గా బాధ్యతలు చేపట్టిన పుల్వామా వీరుడి సతీమణి
ఎస్పీ నేత అజంఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమం
తిటు ద్వీపంపై చైనాకు ఫిలిప్పీన్స్ సవాలు
కుక్కల్లో దొరికిన కరోనా వైరస్ మనుషుల్లో గుర్తింపు
కేరళకు 100 కి.మీ దూరంలో నైరుతి రుతుపవనాలు
పర్యావరణ పరిరక్షణకు మూడు చారిత్రక నిర్ణయాలు
2021 సెషన్ కోసం ఆన్లైన్ కోర్సులను ప్రారంభించిన యూజీసీ
వ్యాక్సిన్ వేసుకుంది.. లాటరీ కొట్టేసింది..
నా రూటే సెపరేటు అన్నాడు.. పుష్ అప్స్ తీయించాడు..
ఎవరెస్ట్ను అధిరోహించిన నార్గే, హిల్లరీ.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..