ఓహియో : కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా టీకాలు ఇచ్చే కార్యక్రమం జోరుగా సాగుతున్నది. కొన్ని దేశాల్లో ఇప్పటికీ వ్యాక్సిన్ ఎట్లుంటదో తెలియదు. మరికొన్ని దేశాల్లో టీకా తీసుకోమంటే భయంతో వెనుకడుగు వేస్తున్నారు. నయానో, భయానో అందరికీ టీకాలు వేయాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తున్నది. ఓహియో రాష్ట్ర ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి వ్యాక్సిన్లు తీసుకునే వారిని ఉత్సాహపరిచేందుకు బంపర్ లాటరీ కూడా ప్రవేశపెట్టారు. ఇటీవల తొలి వ్యాక్సిన్ తీసుకున్న ఓ 22 ఏండ్ల అమ్మడికి ఏకంగా రూ.7 కోట్ల జాక్పాట్ తగిలింది. ఇంకేం అమ్మడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
అమెరికాలో టీకాలను ప్రోత్సహించడానికి ఐదు ‘వాక్స్-ఎ-మిలియన్’ ప్రచారాలలో మొదటి విజేతను శుక్రవారం ప్రకటించారు. ఇందులో 22 ఏండ్ల అబిగైల్ బుగెన్స్కీ.. కరోనా వ్యాక్సిన్ తీసుకుని లాటరీలో ఏడు కోట్లు గెలుచుకున్నది. ‘మొదట నాతో ఎవరో జోక్ చేశారని అనుకున్నాను. కానీ నేను గవర్నర్ మైక్ డివిన్తో మాట్లాడినప్పుడు నిజంగానే నాకు జాక్పాట్ లాటరీ వచ్చిందని తెలుసుకున్నాను. ఇప్పుడు నా కండ్ల నుంచి ఆనందబాష్పాలు వస్తున్నాయి’ అని అబిగైల్ చెప్పారు.
అబిగైల్ మిలియన్ డాలర్లు గెలుచుకోవడంతో ఆమెనంతా ఇప్పుడు మిలియనీర్ అని పిలుస్తున్నారు. అబిగైల్ మెకానికల్ ఇంజనీర్. ఆమె సిన్సినాటికి చెందిన జీఈ ఏవియేషన్ కంపెనీలో పనిచేస్తున్నది. ఈ సందర్భంగా గవర్నర్ మైక్ డివైన్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. “అబిగైల్ విజయం ద్వారా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇతరులు కూడా ప్రేరణ పొందుతారని భావిస్తున్నాను” అని మైక్ డివైన్ చెప్పారు.
నా రూటే సెపరేటు అన్నాడు.. పుష్ అప్స్ తీయించాడు..
ఎవరెస్ట్ను అధిరోహించిన నార్గే, హిల్లరీ.. చరిత్రలో ఈరోజు
జూన్ 20 వరకు జపాన్లో ఎమర్జెన్సీ.. ఒలింపిక్స్కు ముందు సమస్యలు
వచ్చే ఏడాది జూలై 30 న బోరిస్ జాన్సన్ పెండ్లి
ఇమ్యూనిటీ కోసం జింక్ లభించే 5 ఆహారాలు..
మహిళల ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..