టోక్యో : ఒలింపిక్స్కు ముందు జపాన్కు సమస్యలు తగ్గేట్టుగా కనిపించడం లేదు. పరిస్థితులను సద్దుమణిగేలా చేసేందుకు వచ్చే నెల 20 వరకు ఎమర్జెన్సీని పొడగిస్తూ జపాన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్ ప్రారంభానికి రెండు నెలల కన్నా తక్కువ సమయం ఉండటంతో జపాన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.
దేశంలో అత్యవసర పరిస్థితిని తొలుత ఈ నెల 31 వరకుగా ప్రకటించారు. అయితే, అనుకున్నంత మేర ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో జూన్ 20 వరకు పొడగించారు. టోక్యోతో పాటు జపాన్లోని ఎనిమిది ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. ఈ ప్రాంతాల్లో కరోనా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న రోగుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం కలవరపెడుతున్నది.
కఠినమైన వైరస్ నివారణ చర్యలు సక్రమంగా కొనసాగుతుండటంతో ఒలింపిక్స్ జరుగుతుందని జపాన్ అధికారులు, ఒలింపిక్ నిర్వాహకులు, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఇప్పటికే స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రేక్షకులు పాల్గొనకుండా చర్యలు తీసుకుంటూ, అథ్లెట్లు, వారి ప్రతినిధి బృందం సభ్యులను దాదాపు 90 వేల మందినే అనుమతించనున్నారు.
ఆఫ్ఘాన్ వైమానిక దాడుల్లో 23 మంది తాలిబాన్ ఉగ్రవాదులు హతం
వచ్చే ఏడాది జూలై 30 న బోరిస్ జాన్సన్ పెండ్లి
31 కోట్లతో డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొన్న బిగ్ బీ
ఇమ్యూనిటీ కోసం జింక్ లభించే 5 ఆహారాలు..
భారత్లో 5 జీ ట్రయల్స్కు మార్గం సుగమం
మహిళల ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్..!
రా, ఐబీ చీఫ్ పదవీకాలం పొడగింపు
‘వీర్ సావర్కర్’ సినిమాను ప్రకటించిన సందీప్, అమిత్ వాద్వానీ
నటసార్వభౌముడు పుట్టింది ఇవాళే.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..