న్యూఢిల్లీ : ఇంటర్నెట్పై పనిచేసే వారికి శుభవార్త. భారతదేశంలో 5 జీ ట్రయల్స్ పూర్తయ్యాయి. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా సంస్థలకు 5 జీ స్పెక్ట్రంను టెలికాం విభాగం (డీఓటీ) కేటాయించింది. స్పెక్ట్రం కేటాయింపుతో దేశంలో 5 జీ ట్రయల్స్కు మార్గం సుగమం అయింది.
టెలికాం కంపెనీలకు 700 మెగాహెర్ట్జ్, 3.5 గిగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్ల స్పెక్ట్రంను డీఓటీ కేటాయించింది. డీఓటీ వైర్లెస్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ మూడు టెలికాం కంపెనీలకు 5 జీ ఎయిర్వేస్ 100, 800, 10 యూనిట్లను కేటాయించింది. ఈ 5 జీ ట్రయల్ ఎయిర్వేస్ను 6 నెలల సమయానికి కేటాయించారు. టెలికాం కంపెనీలు పట్టణాలతో పాటు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. డీఓటీ వర్గాల సమాచారం ప్రకారం, పంజాబ్, హర్యానా, చండీగఢ్లో ట్రయల్స్ కోసం స్పెక్ట్రం కేటాయించలేదు.
5 జీ ట్రయల్ స్పెక్ట్రం కేటాయింపు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్కు చాలా ముఖ్యమైనది. ఈ రెండు సంస్థలకు 5 జీ-రెడీ నెట్వర్క్ ఉన్నది. కరోనా మహమ్మారి సమయంలో ఈ రెండు సంస్థల డాటా వినియోగం బాగా పెరిగింది. స్పెక్ట్రం కేటాయింపు ఈ రెండు సంస్థలకు 5 జీ సేవలను త్వరగా ప్రారంభించేందుకు సహాయపడుతుంది.
ఈ నెల ప్రారంభంలో 5 జీ ట్రయల్ కోసం 13 దరఖాస్తులను డీఓటీ ఆమోదించినట్లు ఒక నివేదిక తెలిపింది. విచారణ కోసం డీఓటీకి మొత్తం 16 దరఖాస్తులు వచ్చాయి. అయితే, హువావే, జెడ్టీఈ వంటి చైనా కంపెనీలను 5 జీ ట్రయల్కు దూరంగా పెట్టారు. ట్రయల్ అప్లికేషన్ ఆమోదంలో డీఓటీ వివిధ షరతులను పెట్టింది. ట్రయల్స్ కోసం మాత్రమే ఎయిర్వేవ్ను ఉపయోగించడం ఇందులో ముఖ్యమైన షరతు. ఈ కంపెనీలు షరతులను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని కేంద్రం హెచ్చరించింది.
రిలయన్స్ జియో, యూఎస్ టెక్నాలజీ సంస్థ క్వాల్కమ్తో కలిసి అమెరికాలో తన 5 జీ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది. క్వాల్కామ్, రిలయన్స్ అనుబంధ సంస్థ రెడిసిస్తో కలిసి 5 జీ టెక్నాలజీపై కృషి చేస్తున్నామని, దీనిని త్వరలో భారతదేశంలో ప్రారంభించవచ్చని రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఒమన్ తెలిపారు. ప్రస్తుతం, యుఎస్ఎ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, జర్మనీ వంటి దేశాల నుంచి 5 జీ కస్టమర్లు ప్రపంచవ్యాప్తంగా 1 జీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ సదుపాయాన్ని పొందుతున్నారు. శ్రీలంక, ఒమన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ వంటి చిన్న దేశాల్లో కూడా 5 జీ సేవలు లభిస్తున్నాయి.
మహిళల ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్..!
రా, ఐబీ చీఫ్ పదవీకాలం పొడగింపు
‘వీర్ సావర్కర్’ సినిమాను ప్రకటించిన సందీప్, అమిత్ వాద్వానీ
నటసార్వభౌముడు పుట్టింది ఇవాళే.. చరిత్రలో ఈరోజు
కొవిడ్ పాజిటివ్ శిశువుకు జన్మనిచ్చిన నెగెటివ్ తల్లి
218 కోట్ల ఫండ్ అందుకున్న కూ యాప్
జూలై 5 న అమెజాన్ సీఈఓ పదవికి గుడ్బై చెప్పనున్న జెఫ్ బెజోస్
భారత్లో యాంటీబాడీ కాక్టెయిల్తో చికిత్స .. కరోనా నుంచి కోలుకున్న హర్యానా వాసి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..