గుర్గావ్: మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టెయిల్తో చికిత్స పొందిన భారతదేశంలో తొలి కొవిడ్-19 రోగి హబ్రియాలోని ఒక దవాఖాన నుంచి బుధవారం రాత్రి డిశ్చార్జ్ అయ్యాడు. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 82 ఏండ్ల మొహబ్బత్ సింగ్.. మెదాంత దవాఖానలో చికిత్స పొంది కోలుకున్నాడు. యాంటీబాడీ కాక్టెయిల్ ఔషధం తీసుకొని కోలుకున్న దేశంలో తొలి వ్యక్తిగా మొహబ్బత్ సింగ్ నిలిచారు. గత ఏడాది తొలినాళ్లలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే విధమైన చికిత్స తీసుకుని విజయవంతంగా బయటపడ్డారు.
హర్యానాలోని గుర్గావ్కు చెందిన మొహబ్బత్ సింగ్ గత ఐదు రోజులుగా మెదాంత దవాఖానలో మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ మందుతో చికిత్స అందించారు. మొహబ్బత్ సింగ్ కరోనాతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. మంగళవారం అతడికి ఈ ఔషధం మొదటి మోతాదు ఇచ్చారు. యాంటీబయాటిక్ కాక్టెయిల్ ఔషధం తీసుకున్న ఒక రోజు తర్వాత మొహబ్బత్ సింగ్ ఆరోగ్యవంతుడిగా తయారయ్యాడు. దాంతో ఆయనను బుధవారం రాత్రి డిశ్చార్జ్ చేశారు.
కరోనా సోకిన వ్యక్తికి ఈ ఔషధం మోతాదును 7 రోజుల్లో ఇస్తే.. 70-80 శాతం మంది దవాఖానలో చేరాల్సిన అవసరం ఉండేవారు కూడా ఇంట్లోనే ఉండి కోలుకోవచ్చని మెదాంత హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నరేష్ ట్రెహాన్ వెల్లడించారు. మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ ఔషధంతో చికిత్స చేసే విధానం అమెరికా, ఐరోపాలో ఎక్కువగా అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. కొన్ని సందర్భాల్లో పిల్లలకు కూడా దీన్ని ఇవ్వవచ్చునని చెప్పారు.
యాంటీబాడీ కాక్టెయిల్ కాసిరివిమాబ్, ఇమ్దేవిమాబ్ అనే రెండు ఔషధాలతో రూపొందించబడిన ఈ ఔషధం.. వైరస్పై ఒకే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ ఔషధాన్ని స్విస్ కంపెనీ రోచె ఇండియా తయారు చేసింది. ఈ ఔషధం మొదటి బ్యాచ్ సోమవారం భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. తదుపరి బ్యాచ్ జూన్ 15 నాటికి వస్తుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. జూన్ నాటికి లక్ష ప్యాకెట్లు భారతదేశంలో అందుబాటులో ఉండనున్నాయి. వీటి ద్వారా దాదాపు 2 లక్షల మంది ప్రయోజనం పొందుతారు.
1200 ఎంజీ ప్రతి మోతాదులో 600 ఎంజీ కాసిరివిమాబ్, 600 ఎంజీ ఇమ్డేవిమాబ్ ఉన్నాయి. ప్రతి మోతాదు ధర రూ.59,750 . మల్టీడోస్ ప్యాకెట్ గరిష్ట ధర రూ.1.19 లక్షలు. ఈ యాంటీబాడీని సిప్లా సంస్థ మన దేశంలో మార్కెటింగ్ నిర్వహిస్తున్నది.
కొవిడ్ నివారణలో ‘సెనోటైజ్’ 99 శాతం ప్రభావవంతం : గిల్లి రిగెవ్
భారత తొలి ప్రధాని నెహ్రూ కన్నుమూత.. చరిత్రలో ఈరోజు
వ్యాక్సిన్ నిలపాలంటూ పిటిషన్.. పిటిషన్దారుకు 50 వేల జరిమానా..
భారత్లో 130 రోజుల్లో 20 కోట్ల మందికి వ్యాక్సిన్
పాకిస్తాన్తో యుద్ధం వస్తే రాష్ట్రాలు సొంత ట్యాంకులు కొని పోరాడాలా? : కేజ్రీవాల్
సముద్రంలో అరుదైన ఖనిజాలను కనుగొన్న జపాన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..