న్యూఢిల్లీ : పాకిస్తాన్తో యుద్ధం వస్తే రాష్ట్రాలు సొంతంగా ట్యాంకులు కొనుగోలు చేసి పోరాడతాయా..? లేక కేంద్రంలోని ప్రభుత్వం ఆ పని చూసుకుంటుందా..? అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. రాష్ట్రాల్లో సరిపోయేంత వ్యాక్సిన్లు లేకపోవడానికి కేంద్రం తీరే కారణమని ఆయన చెప్పారు. కేంద్రం వ్యాక్సిన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేయకుండా సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదన్నారు.
ఢిల్లీలో కరోనా కేసులు మునుపటి కంటే గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అయితే, కరోనా వ్యాక్సిన్లను కేంద్రం రాష్ట్రాలకు సరఫరా చేయకుండా మిన్నకుండి పోవడం చాలా బాధాకరమన్నారు. బుధవారం సాయంత్రం డిజిటల్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్డౌన్, ఇతర ఆంక్షలు పెట్టడం ద్వారా ఇన్ఫెక్షన్ రేటును తగ్గించే ఎక్సర్సైజ్ జరుగుతున్నదని చెప్పారు.
ఢిల్లీలో టీకా ఇవ్వడం ముగిసిపోయింది. గత నాలుగు రోజులుగా 18-44 సంవత్సరాల వయసు వారికి వ్యాక్సిన్ ఇవ్వలేదు. టీకా కేంద్రాలు మూతపడుతున్నాయి. ఈ పరిస్థితి సరైనది కాదు. అటువంటి పరిస్థితిలో ప్రమాదం పెరిగే అవకాశం ఉన్నది. ఇది ఢిల్లీ ఒక్కదానికే కాకుండా మొత్తం దేశం పరిస్థితి ఇదేనని ఆయన వివరించారు. ఆరు నెలల క్రితం వేయాల్సిన టీకాలను ఇప్పుడు మన వాళ్లకు ఇస్తున్నామని చెప్పారు. మొదటి వ్యాక్సిన్ ఇక్కడే తయారుచేసినా.. ఇక్కడ టీకాలు వేయకుండా ఇతర దేశాలకు పంపడం మొదలెట్టడం వల్లనే ఇలాంటి పరిస్థితి దాపురించిందన్నారు.
మధ్యప్రదేశ్లో పీపీఈ కిట్ల కుంభకోణం..
ఇక ఎవరి ఆస్తికి నష్టం కలిగించినా భర్తీ చేయాల్సిందే..!
సముద్రంలో అరుదైన ఖనిజాలను కనుగొన్న జపాన్
7 ఏండ్లలో మోదీ 7 నిర్ణయాలు.. ప్రతి భారతీయుడిపై ప్రభావం
భారత ప్రధానిగా మోదీ ప్రమాణం.. చరిత్రలో ఈరోజు
అరటితో ఏమేం పోషకాలు అందుతాయంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..