వారణాసి : దేశ సాంస్కృతిక రాజధాని అయిన వారణాసిలో ప్రత్యేకమైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ఒక కొవిడ్-19 నెగెటివ్ మహిళ కరోనా పాజిటివ్ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బనారస్ హిందూ యూనివర్సిటీలోని సర్ సుందర్లాల్ దవాఖానలో జరిగిన ఈ ఘటనను చూసి స్థానిక వైద్యులు, ఇతర సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ బయటకు దర్జాగా వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ నేపథ్యంలో తల్లి కడపులో నుంచి ఓ ఆడ శిశువు కొవిడ్ పాజిటివ్తో ప్రపంచంలోకి వచ్చింది. తల్లి నెగెటివ్ కావడం ఇక్కడ గమ్మత్తైన విసయం. వారణాసిలో ఒక మహిళ మే 25 న కరోనా వైరస్ సోకిన బిడ్డకు జన్మనిచ్చింది. మహిళను దవాఖానలో చేర్చే ముందు మే 23 న కరోనా నిర్ధారణ పరీక్ష జరుపగా నెగెటివ్గా వచ్చింది. రెండు రోజుల తర్వాత ఆమె పండంటి పాపాయికి జన్మనిచ్చింది. అయితే అమ్మాయి కరోనా పాజిటివ్గా తేలింది. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు. శిశువుకు కరోనా వైరస్ సోకడం పట్ల ఇక్కడి వైద్యులు ఆశ్చర్యపోతున్నారు. నాలుగు రోజులు గడిచాక మరోసారి ఇద్దరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపుతామని సీఎంఓ తెలిపారు.
218 కోట్ల ఫండ్ అందుకున్న కూ యాప్
జూలై 5 న అమెజాన్ సీఈఓ పదవికి గుడ్బై చెప్పనున్న జెఫ్ బెజోస్
భారత్లో యాంటీబాడీ కాక్టెయిల్తో చికిత్స .. కరోనా నుంచి కోలుకున్న హర్యానా వాసి
కొవిడ్ నివారణలో ‘సెనోటైజ్’ 99 శాతం ప్రభావవంతం : గిల్లి రిగెవ్
భారత తొలి ప్రధాని నెహ్రూ కన్నుమూత.. చరిత్రలో ఈరోజు
వ్యాక్సిన్ నిలపాలంటూ పిటిషన్.. పిటిషన్దారుకు 50 వేల జరిమానా..
సముద్రంలో అరుదైన ఖనిజాలను కనుగొన్న జపాన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..