పుణె : నా రూటే సెపరేటు అని చెప్పడమే కాకుండా చేసి చూపించాడు నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్. శిక్షణ పొందిన క్యాడెట్ల పాసింగ్ అవుట్ పరేడ్లో క్యాడెట్లతో పుష్ అప్స్ చేయించి ఔరా! అనిపించాడు. వారితో చేయించడమే కాకుండా ఆయన కూడా వారితో కాలు కదిపారు. దాంతో క్యాడెట్లలో ఎక్కడలేని హుషారు వచ్చినట్లయింది. ఇంకేముంది అధికారులతో పాటు క్యాడెంట్లు పుష్ అప్స్ చేశారు.
పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డే) 140 వ కోర్సులో 300 మందికి పైగా క్యాడెట్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. వీరి కవాతును సమీక్షించేందుకు నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ హాజరయ్యారు. ఈ కేంద్రంలో సైన్యం, వైమానిక దళం, నేవీ శిక్షణ ఇస్తారు. ఇక్కడ మూడేండ్ల కోర్సు పూర్తి చేసిన తర్వాత వారు తమ అకాడమీలో ఒక ఏడాది తుది శిక్షణ పొందుతారు. పాసింగ్ అవుట్ పరేడ్కు వచ్చిన అడ్మిరల్ కరంబీర్ సింగ్.. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లతో పుష్ అప్స్ చేయించి, తాను చేసి వారిని ఉత్సాహపరిచారు. ఒక్కొక్కరితో దాదాపు 25, 30 పుష్ అప్స్ చేయించి.. ఇదే అందరికీ ఆరోగ్యమంత్రమని ఉపదేశించారు,
అనంతరం హంటర్-స్కౌడ్రాన్ (హౌస్, హాస్టల్) కు కూడా వెళ్లి కలియదిరిగారు. 41 సంవత్సరాల క్రితం తన మధుర స్మృతులను నెమరేసుకున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణె, ఎయిర్ చీఫ్ మార్షల్ భదూరియాతో కలిసి కరంబీర్ సింగ్ ఇక్కడే శిక్షణ తీసుకున్నారు. ఎన్డీఏ కోర్సు పూర్తిచేసిన తర్వాత నేవీలో చేరారు.
ఎవరెస్ట్ను అధిరోహించిన నార్గే, హిల్లరీ.. చరిత్రలో ఈరోజు
జూన్ 20 వరకు జపాన్లో ఎమర్జెన్సీ.. ఒలింపిక్స్కు ముందు సమస్యలు
వచ్చే ఏడాది జూలై 30 న బోరిస్ జాన్సన్ పెండ్లి
ఇమ్యూనిటీ కోసం జింక్ లభించే 5 ఆహారాలు..
మహిళల ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..