లక్నో: సమాజ్వాదీ పార్టీ నాయకుడు అజం ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా తయారైంది. ప్రస్తుతం ఆయన లక్నోలోని మేదంత దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్లో ఉంచారు.
“సమాజ్వాదీ పార్టీ నాయకుడు అజం ఖాన్ పరిస్థితి క్లిష్టంగా తయారైంది. అతను ఆక్సిజన్ మద్దతుతో ఉన్నాడు” అని లక్నోలోని మేదంత దవాఖాన యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 9 న ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చికిత్స అందించేందుకు అజంఖాన్ను సీతాపూర్ జైలు నుంచి లక్నోలోని మేదంత దవాఖానకు తరలించారు. అజంఖాన్కు కరోనావైరస్ సోకినట్లుగా గుర్తించి చికిత్స అందిస్తున్నారు.
ఏప్రిల్ 30 న అజంఖాన్తో పాటు ఆయన కుమారుడు కూడా కరోనా పాజిటివ్గా తేలారు. మే 9 న అజామ్ ఖాన్ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది. కుమారుడితో కలిసి లక్నో దవాఖానకు వెళ్లిన అజాం ఖాన్.. ప్రస్తుతం ఆక్సిజన్ సపోర్ట్లో ఉన్నారు. అజం ఖాన్ గత ఏడాది ఫిబ్రవరి నుంచి సీతాపూర్ జైలులో ఉన్నారు. అతని కొడుకు కూడా సీతాపూర్ జైలులోనే ఉంటున్నాడు.
తిటు ద్వీపంపై చైనాకు ఫిలిప్పీన్స్ సవాలు
కుక్కల్లో దొరికిన కరోనా వైరస్ మనుషుల్లో గుర్తింపు
కేరళకు 100 కి.మీ దూరంలో నైరుతి రుతుపవనాలు
పర్యావరణ పరిరక్షణకు మూడు చారిత్రక నిర్ణయాలు
2021 సెషన్ కోసం ఆన్లైన్ కోర్సులను ప్రారంభించిన యూజీసీ
వ్యాక్సిన్ వేసుకుంది.. లాటరీ కొట్టేసింది..
నా రూటే సెపరేటు అన్నాడు.. పుష్ అప్స్ తీయించాడు..
ఎవరెస్ట్ను అధిరోహించిన నార్గే, హిల్లరీ.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..