ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు వ్యతిరేకంగా 11 ప్రతిపక్ష రాజకీయ పార్టీల కూటమి.. పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (పీడీఎం) తదుపరి దశ ఆందోళనను ప్రకటించింది. ఈ ఉద్యమం జూలై 4 న స్వాత్ జిల్లా నుంచి ప్రారంభమవుతున్నట్లు పీడీఎం కన్వీనర్ మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ తెలిపారు. స్వాత్లో పెద్ద ప్రదర్శన చేపట్టిన తర్వాత కరాచీ, ఇస్లామాబాద్తోపాటు ఇతర నగరాల్లో ప్రదర్శనలు జరుగుతాయని చెప్పారు.
ఇమ్రాన్ఖాన్ను గద్దె దింపేందుకు దేశవ్యాప్త ఉద్యమం చేపట్టేందుకు ఇస్లామాబాద్లో నిర్వహించిన సంకీర్ణ పార్టీల సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో ఈవీఎం ఎన్నికలు నిర్వహించడానికి చేసిన ప్రయత్నాలు కూడా కఠినమైనవిగా పరిగణించారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించే ప్రణాళికలను ప్రతిపక్ష కూటమి తిరస్కరించింది. సమావేశం అనంతరం నిర్ణయాలను, ఉద్యమం చేపట్టే తీరును పీడీఎం కన్వీనర్ మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ మీడియాకు వెల్లడించారు.
బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆకర్శణీయమైన డిజైన్
నేతలు కావాలన్న ఆతృతలో మిగిలిపోతున్న రైతు సమస్యలు: సర్దార్ వీఎం సింగ్
ఎల్ఓసీపై 3 నెలలుగా ఒక్క బుల్లెట్ పేలలేదు : జనరల్ ఎంఎం నరవణె
వానాకాలం కరోనా వైరస్తో జాగ్రత్త.. ఇవి పాటించండి..!
ఎల్లుండి నుంచి ఎంపీలో అన్లాక్ : మార్గదర్శకాలు వెల్లడి
ఆరేండ్ల క్రితం కేసులో హైకోర్టు తీర్పు.. ధర్మసంకటంలో పినరాయి ప్రభుత్వం
తొలి హిందీ వార్తాపత్రిక ప్రారంభం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..