ఆళ్లపల్లి, ఆగస్టు 01 : పై ఫొటోలో చిత్తడిగా మారిన రోడ్డు మట్టి రోడ్డు అనుకుంటే పొరపాటు పడినట్టే. ఆళ్లపల్లి మండల పరిధి మర్కోడు పంచాయతీ 5వ వార్డు అంబేద్కర్ కాలనీ సీసీ రోడ్లు చిన్న చినుకులకే ఇలా బుర్దమయంగా మారుతున్నాయి. సైడ్ డ్రైనేజీల మట్టి తీసి రోడ్డుపై వేసి వదిలేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు మొత్తం బురద మయంగా మారాయి. కనీసం నడవడానికి వీలు లేకుండా ఉంటున్నాయని కాలనీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీసీ రోడ్డు మర్కోడులోని బొడ్రాయి సెంటర్ వద్ద ప్రధాన రహదారికి వెళ్లే రహదారి. ఈ ఈ రహదారి వెంబడి పాఠశాలకు వెళ్లే పిల్లలు, అంగన్వాడీ పిల్లలు, నిత్యవసరాలకు, ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు, కూలీలు ప్రతినిత్యం నడిచే దారి ఇది. వర్షాకాలం కావడం వల్ల ప్రజలు ఈ దారిలో నడవాలంటే జంకుతున్నారు. కావున అధికారులు స్పందించి మట్టి రోడ్డుగా ఉన్న ఈ రోడ్డును సీసీ రోడ్డుగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.