కోహీర్/సంగారెడ్డి : కొవిడ్ ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటుతో నిరుపేదలకు ఎంతగానో మేలు జరుగుతుందని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లాలోని కోహిర్ మండలం కవేలి హోటల్ మేనేజ్ మెంట్ కళాశాల ఆవరణలో మాజీ జడ్పీటీసీ అరవింద్ రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కరోనా సోకిన అనాథలు, నిరుపేదలు ఇందులో ఉంటే ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్యంతో పాటు పౌష్టికాహారం అందజేస్తారని వివరించారు.
కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ట్రస్ట్ నిర్వాహకులు స్రవంతిరెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రాఘవపూర్ పీహెచ్సీకి జాతీయ అవార్డు
సురేందర్ రెడ్డికి నివాళులు అర్పించిన ఎంపీ సంతోష్ కుమార్
అంతర్జాల వేదికగా..ఎన్టీఆర్కు ఘన నివాళులు
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
రైతులకు జనుము విత్తనాలు పంపిణీ
నారాయణపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత