నిజామాబాద్ : జిల్లాలోని వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి, రైతు నాయకుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. రైతు నాయకుడిగా సురేందర్ రెడ్డి చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. అనంతరం సురేందర్ రెడ్డి విగ్రహం వద్ద ఎంపీ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.