హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముస్లిం ద్రోహి అని మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇషాక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడేండ్ల పాలనలో మైనారిటీల అభివృద్ధి, సంక్షేమాన్ని గాలి కొదిలేసిందని గురువారం ప్రకటనలో మండిపడ్డారు. వక్ఫ్ భూములు, ఉర్దూ అకాడమీ, ఉర్దూ యూనివర్సిటీ భూములను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు.
కేసీఆర్ ఏర్పాటు చేసిన మైనారిటీ గురుకులాల్లో చదువుకొని ఉన్నతస్థాయికి ఎదిగిన ప్రతిభావంతులను సన్మానించడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. కేసీఆర్పై కక్షతో కాంగ్రెస్ సర్కార్ మైనారిటీ గురుకులాలను నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. ముస్లిం పిల్లలు చదివితే గుర్తుంచుకోరని, పాతబస్తీలో విద్యుత్ చౌర్యం చేస్తారని సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండించారు.