‘దేశంలో 28 రాష్ట్రాలున్నయ్. 28 ఇంజిన్లున్నయ్. అన్ని రాష్ట్రాలు బలంగా పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకు సాగుతది. ఒక డబుల్ ఇంజిన్తో దేశం అభివృద్ధి చెందదు. తెలంగాణలో ఒక ఇంజిన్తోనే కేసీఆర్ ప్రభుత్వం అనేక రంగాల్లో మెరుపువేగంతో దూసుకెళ్లింది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్లో శనివారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : ‘దేశంలో 28 రాష్ట్రాలున్నయ్. 28 ఇంజిన్లున్నయ్. అన్ని రాష్ట్రాలు బలంగా పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకు సాగుతుంది. ఒక డబుల్ ఇంజిన్తో దేశం అభివృద్ధి చెందదు. తెలంగాణలో ఒక ఇంజిన్తోనే కేసీఆర్ ప్రభుత్వం అనేక రంగాల్లో మెరుపువేగంతో దూసుకెళ్లింది. తెలంగాణ కంటే మెరుగ్గా పనిచేసిన ఒక డబుల్ ఇంజిన్ రాష్ట్రాన్ని చూపించండి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. రెండేండ్ల తర్వాత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఆయన నాయకత్వంలోనే తెలంగాణ తిరిగి అభివృద్ధి బాట పడుతుందని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ కార్యక్రమాలను మరింత విస్తరిస్తూ కేసీఆర్ను మళ్లీ సీఎం చేసుకునే దిశగా పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సబ్బండవర్ణాలను మోసం చేసిన కాంగ్రెస్ దుష్టపాలనను గ్రామగ్రామాన ఎండగడుతామని స్పష్టంచేశారు. దేశంలో తీవ్ర నాయకత్వ లోపం ఉన్నదని, స్వాతంత్య్రం వచ్చి 80 ఏండ్లు కావస్తున్నా ఇంకా అనేక గ్రామాల్లో కనీస రోడ్లు, విద్యుత్తు, పాఠశాలలు లేకపోవడం విచారకరమని వాపోయారు.
ప్రజలకు అవకాశాలు, రైతులకు భరోసా కల్పిస్తూ అన్ని రాష్ట్రాల సమాన అభివృద్ధే అసలైన దేశభక్తి అని స్పష్టంచేశారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్లో శనివారం కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర, దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు వ్యక్తిగత, ప్రాంతీయ, భాషా, మత, కుల, రాష్ట్రపరమైన గుర్తింపులు ఎన్ని ఉన్నా అన్నింటికంటే ముందుగా మనమంతా భారతీయులమని, భారతీయత అనే భావమే దేశ ప్రజలందరినీ ఒకటిగా నడిపిస్తున్నదని తేల్చిచెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మహాత్మాగాంధీని గొప్పగా గౌరవిస్తుంటే, మనదేశంలో మాత్రం ఆయనను అవమానించేలా, ఆయనను హత్య చేసిన వారిని కీర్తించేలా కొందరు వ్యవహరించడం బాధాకరమని వాపోయారు.
నేటికీ కనీస సౌకర్యాల్లేవెందుకు?
భారతదేశంలో సహజ వనరులకు కొదువ లేదని, కానీ నేటికీ అనేక గ్రామాల్లో కనీస వసతులు లేవని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలోని నదుల ద్వారా 70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని, అయినా సాగునీటి కోసం రైతులు, తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందాలని కేసీఆర్ ఆకాంక్షించారని గుర్తుచేశారు. స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడిచినా దేశంలోని నీటి వనరులను సమర్థంగా ఎలా వినియోగించుకోవాలన్న దానిపై సమగ్ర ప్రణాళిక లేకపోవడం విచారకరమని వాపోయారు. దేశమంతటా 24 గంటల కరెంట్ సరఫరా చేయగల స్థాపిత విద్యుత్తు సామర్థ్యం ఉన్నా గ్రిడ్ కనెక్టివిటీ లేకపోవడం, పాలకుల చిత్తశుద్ధి కొరవడటంతో కరెంట్ సమస్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు.
చైనా ఎకడున్నది? భారత్ ఎకడున్నది?
జనాభా ఎకువగా ఉండటం వల్ల భారతదేశం అభివృద్ధి చెందలేకపోతున్నదనే వాదనలో వాస్తవం లేదని కేటీఆర్ చెప్పారు. దీనికి చైనాను ఉదాహరణగా తీసుకోవాలని సూచించారు. నాలుగు దశాబ్దాల క్రితం భారత్తో పోలిస్తే చైనా ఆర్థికంగా వెనుకబడి ఉన్నదని, 1980ల ప్రారంభంలో చైనా ఆర్థిక వ్యవస్థ భారత్ కంటే పేదదిగా ఉండేదని గుర్తుచేశారు. పట్టుదల, దీర్ఘకాలిక ప్రణాళిక, స్పష్టమైన లక్ష్యాలతో చైనా నాలుగు దశాబ్దాల్లో అమెరికా వంటి అగ్రదేశాలతో పోటీ పడే స్థాయికి ఎదిగిందని గుర్తుచేశారు. 1980లలో భారత్-చైనా ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ముందున్నా, నేడు చైనా ఆర్థిక వ్యవస్థ 20 ట్రిలియన్ డాలర్లకుపైగా ఉన్నదని, భారత్ సుమారు 3.4 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉన్నదని తెలిపారు. మనకంటే దాదాపు ఆరు రెట్లు పెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఎదిగిందని చెప్పారు. భారత్కు సహజ, మానవ వనరులు సమృద్ధిగా ఉన్నా దేశాన్ని ముందుకు నడిపించే స్పష్టమైన నాయకత్వం, దీర్ఘకాలిక ప్రణాళిక, చిత్తశుద్ధి లోపించాయని విమర్శించారు.
దేశానికి నాయకత్వమే కొరవడింది
తాను ఒక పార్టీ నాయకుడిగా కాకుండా సగటు భారతీయుడిగా మాట్లాడుతున్నానని కేటీఆర్ తెలిపారు. తన పిల్లలు దేశంలోనే ఉండి చదువుకొని, ఉద్యోగాలు చేసి, అభివృద్ధి చెందే పరిస్థితి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ‘మన పిల్లలు చదవడానికి అమెరికా వెళ్లాల్సిన అవసరం ఎందుకు రా వాలి? ఇకడే ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు ఎం దుకు ఉండకూడదు?’ అని ప్రశ్నించారు. ఐఐటీలు, ఐఐఎంల వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఏర్పాటు చేసినా అవకాశాల కోసం దేశంలోని ప్రతిభావంతులైన యువత విదేశాలకు వెళ్తూనే ఉన్నదని చెప్పారు. దేశంలోనే ప్రపంచస్థాయి విద్య, ఉపాధి, పరిశోధన, వ్యాపార అవకాశాలు కల్పించి ప్రతిభావంతులను బయటకు వెళ్లకుండా పరిస్థితులను మార్చాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నదని చెప్పారు. భారత్లో కొరవడింది వనరులు కాదని, నాయకత్వమేనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
తెలంగాణ మాడల్ అమలు కావాలి
కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో తొమ్మిదిన్నరేండ్లలో అమలు చేసిన పథకాలు, సాధించిన ఫలితాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే ఉద్దేశంతోనే భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించిందని కేటీఆర్ గుర్తుచేశారు. భారతదేశంలో నీళ్లు, విద్యుత్తు, వ్యవసాయం, సంక్షేమం, మౌలిక వసతులు వంటి అంశాలపై సమగ్ర ప్రణాళిక అవసరమని కేసీఆర్ ఎప్పటినుంచో చెప్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణలో సాధ్యమైన మాడల్ దేశవ్యాప్తంగా ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో అనేక మార్పులు తీసుకొచ్చారని, విద్యుత్తు సమస్యను అధిగమించి 24 గంటల కరెంటు అందించారని, సాగునీటి విస్తరణ చేపట్టారని, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, కంటి వెలుగు వంటి అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని వివరించారు.
డబుల్ ఇంజిన్తో అభివృద్ధి జరుగదు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న ‘డబుల్ ఇంజిన్’ నినాదాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్న వాదన సరికాదని చెప్పారు. ‘దేశంలో 28 రాష్ట్రాలున్నయ్. 28 ఇంజిన్లు ఉన్నయ్. అన్ని రాష్ట్రాలు బలంగా పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకు సాగుతుంది. ఒక డబుల్ ఇంజిన్తో దేశం అభివృద్ధి చెందదు’ అని స్పష్టంచేశారు. రాజకీయ విభేదాల కారణంగా రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిషరించేందుకు లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మెట్రో విస్తరణకు అనుమతి కోరినా నాడు కేంద్రం స్పందించలేదని గుర్తుచేశారు. అదే సమయంలో ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో చిన్న పట్టణాలకూ మెట్రో ప్రాజెక్టులు మంజూరు చేశారని విమర్శించారు.
రేవంత్ తపనంతా కుటుంబ అభివృద్ధికోసమే
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 18 గంటలు పనిచేస్తున్నానని అంటున్నారని, అయితే ఆ సమయాన్నంతా తన అన్నదమ్ములకు రాష్ట్రాన్ని దోచిపెట్టడానికే వాడుతున్నారని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ‘కొండల్రెడ్డికి కొండలు ఎలా కట్టబెట్టాలి? తిరుపతిరెడ్డికి ఎలా భూములు ధారాదత్తం చేయాలి? అనే ఆలోచన తప్ప తెలంగాణ ప్రజల గురించి సీఎంకు పట్టింపు లేదని విమర్శించారు. తన కుటుంబాన్ని, అన్నదమ్ములను అదానీ కుటుంబం కంటే పెద్దగా ఎలా చేయాలనే తపన తప్ప పరిపాలనపై సోయి లేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయశాఖ సమన్వయంతో రైతుల పొలాల వద్దకే ఎరువులు చేరేలా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. నేడు రైతులు యూరియా కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. రైతులు అధికారుల కాళ్లు పట్టుకొని యూరియా బస్తా ఇవ్వాలని వేడుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం ఎరువు ల కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి రావడం ప్ర భుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
తెలంగాణభవన్కు రెండు దశాబ్దాలు
ఆగస్టు 14తో తెలంగాణభవన్ నిర్మాణానికి సరిగ్గా 20 ఏండ్లు పూర్తయ్యాయని కేటీఆర్ తెలిపారు. రెండు దశాబ్దాల ప్రయాణంలో ఈ భవనం కేవలం పార్టీ కార్యాలయంగా కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్రకు, పార్టీ ప్రస్థానానికి, కార్యకర్తల త్యాగాలకు ప్రతీకగా నిలిచిందని చెప్పారు. 2001లో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సమయంలో కేసీఆర్కు కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యంలో తన నివాసాన్ని అందించారని గుర్తుచేశారు. ‘ఇకడి నుంచే పార్టీ, ఉద్యమం నడపండి.. నా ఇంటి నుంచే నడపండి’ అని బాపూజీ పార్టీకి ఆశ్రయం ఇచ్చారు. అకడే తెలంగాణ జెండా ఎగిరింది’ అని గుర్తుచేశారు. అయితే అప్పటి ప్రభుత్వం అర్ధరాత్రి చెప్పాపెట్టకుండా పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయిం చి, సామగ్రిని బయటకు తీసి, ప్రభుత్వ స్థలమని చె ప్పి అకడి నుంచి వెళ్లగొట్టిందని గుర్తుచేశారు. కొం తకాలం నందినగర్లో కేసీఆర్ నివాసం నుంచే పార్టీ కార్యకలాపాలు సాగాయని, అనంతరం ఎమ్మెల్యే క్వార్టర్స్లో చిన్న కార్యాలయం ఏర్పాటు చేసుకొని పార్టీ కార్యక్రమాలను కొనసాగించామని తెలిపారు.
2004లో ప్రజల మద్దతుతో కేసీఆర్ యూపీఏ ప్రభుత్వంలో చేరిన అనంతరం పార్టీకి శాశ్వత కార్యాలయం ఉండాలనే ఆలోచన బలపడిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి, పార్టీ నిర్మాణానికి ఒక శాశ్వత కేంద్రం అవసరమని కేసీఆర్ పట్టుదలగా నిర్ణయించి తెలంగాణభవన్ కోసం స్థలాన్ని ఎంపిక చేశారని వివరించారు. తెలంగాణభవన్ నిర్మాణం వెనుక కేసీఆర్ దూరదృష్టి ఉన్నదని కేటీఆర్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, నవీన్కుమార్, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మ య్య, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, ని రంజన్రెడ్డి, మాజీ ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్నాయక్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, పల్లె రవికుమార్, చిరుమళ్ల రాకేశ్, వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు తలసాని సాయికిరణ్యాదవ్, కిశోర్గౌడ్, తుల ఉమ, సుమిత్రానంద్, రామచంద్రునాయక్, రాజేశ్వర్రావు పాల్గొన్నారు.
దుర్మార్గ కాంగ్రెస్పై పోరాడాలి : మధుసూదనాచారి
బ్రిటిష్వారికి వ్యతిరేకంగా నాడు స్వాతంత్య్ర సమరయోధులు ఎలా పోరాడారో ఇప్పటి దుర్మార్గ కాంగ్రెస్ పాలనపై కూడా తెలంగాణ ప్రజలు పోరాడాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పిలుపునిచ్చారు. 80 ఏండ్ల స్వతంత్ర భారత దేశంలో ఎవరూ చేయలేని విధంగా తెలంగాణ రా ష్ర్టాన్ని కేసీఆర్ అపురూపంగా తీర్చిద్దారని చెప్పారు.
స్వాతంత్య్ర పోరాటానికి తెలంగాణ ఉద్యమం తీసిపోదు: మహమూద్ అలీ
నాడు బ్రిటీషర్లపై స్వాతంత్య్రం కోసం భారతీయు లు చేసిన పోరాటానికి, తెలంగాణ రాష్ట్ర సాధన కో సం తెలంగాణవాదులు చేసిన ఉద్యమం ఏ మాత్రం తీసిపోదని మాజీ మంత్రి మహమూద్ అలీ చెప్పా రు. గాంధీజీ నాయకత్వంలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినట్టు, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటైందని చెప్పారు.కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వెనుక మానవీయ ఆలోచన
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎన్నికల్లో ఓట్ల కోసం రూపొందించినవి కావని కేటీఆర్ చెప్పారు. పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల పెండ్లిళ్ల సమయంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను చూసి కేసీఆర్ మదిలోంచి ఈ పథకాలు పుట్టుకొచ్చాయని వివరించారు. ఒక తండాలో కేసీఆర్ పల్లెనిద్ర చేసిన సమయంలో ఓ గిరిజన కుటుంబానికి చెందిన తండ్రి తన ఇల్లు కాలిపోవడంతోపాటు కూతురు పెండ్లి కోసం దాచుకున్న రూ.60 వేలు కూడా కాలిపోయాయని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న ఘటనను గుర్తుచేశారు. ఆ కుటుంబాన్ని కేసీఆర్ ఓదార్చి ఆ అమ్మాయి పెండ్లికి సహాయం చేశారని, ఆ సంఘటన ఆయన మనసులో నిలిచిపోయిందని చెప్పారు. పేద తల్లిదండ్రులు తమ ఆడపిల్లల పెండ్లిళ్ల కోసం పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చారని వివరించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టకుండా, ఓట్ల కోసం ప్రచారం చేయకుండా పథకాన్ని అమలు చేయడం కేసీఆర్ మానవీయ దృక్పథానికి నిదర్శనమని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 15 లక్షల పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం చేసిందని, సుమారు 14 లక్షల మంది తల్లులు, శిశువులకు కేసీఆర్ కిట్లు అందించిందని తెలిపారు. బాల్య వివాహాలను నిరోధించి, 18 ఏండ్లు నిండిన తర్వాత ఆడబిడ్డలకు గౌరవంగా వివాహం జరిగేలా చేయడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణను అమితంగా ప్రేమించే నాయకుడు కేసీఆరే
భారతదేశ జనాభాలో తెలంగాణ వాటా 2.7 నుంచి 2.8 శాతం మాత్రమేనని, కానీ దేశ జీడీపీలో వాటా సుమారు 5.2 శాతం ఉన్నదని కేటీఆర్ చెప్పారు. ‘మనం మన బరువుకంటే దాదాపు రెండింతలు మోస్తున్నాం’ అని పేరొన్నారు. భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాల్లో ఒకటని గుర్తుచేశారు. తెలంగాణను దివాలా రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాస్తవానికి దేశానికి ఆర్థికంగా తోడ్పడుతున్న రాష్ట్రా ల్లో తెలంగాణ ముందున్నదని చెప్పారు. తెలంగాణను ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకెళ్లగల నాయకత్వ సామర్థ్యం కేసీఆర్కు మాత్రమే ఉన్నదని చెప్పారు. తెలంగాణను అమితంగా ప్రేమించే నాయకుడు కేసీఆరేనని స్పష్టంచేశారు.
మళ్లీ అధికారం బీఆర్ఎస్దే
తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. ఇందుకు సమయం పట్టవచ్చని, అయితే రాబోయే రెండేండ్లు పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రతిరోజూ ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం చేయాలని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.
తులం బంగారం హామీ ఏమైంది?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం అమలుచేసిన అనేక ప్రజా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను బంద్ చేశారని కేటీఆర్ విమర్శించారు. కల్యాణలక్ష్మి, రైతుబీమా, కేసీఆర్ కిట్ వంటి పథకాలకు కాంగ్రెస్ పాతరేసిందని మండిపడ్డారు. తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దానిపై మాటే ఎత్తడం లేదని విమర్శించారు. పేద ఆడబిడ్డల వివాహాలకు సంబంధించిన సమస్యలపై స్పందించడానికి కూడా ప్రభుత్వానికి సమయం లేకపోవడం బాధాకరమని వాపోయారు. ఇవాళ తెలంగాణలో పల్లె నుంచి పట్నం వరకు ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. ‘కేసీఆర్ ఉంటే 24 గంటల కరెంటు ఉండేది.. కేసీఆర్ ఉంటే నీళ్లందేవి.. కేసీఆర్ ఉంటే రైతుబంధు వచ్చేది’ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ముందు ఆలోచించి ఓటు వేయాల్సిన బాధ్యత ప్రజలదేనని చెప్పారు. మంచి పాలనను వదులుకొని సమస్యలు పరిషరించలేని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే దాని ఫలితాలను ఐదేండ్ల్లపాటు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు.
మనదేశంలో సహజ వనరులకు కొదువ లేదు. కానీ నేటికీ అనేక గ్రామాల్లో కనీస వసతుల్లేవు. దేశంలోని నదుల నుంచి 70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉన్నది. అయినా ఇప్పటికీ సాగునీటి కోసం రైతులు, తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నరు. స్వాతం త్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడిచినా నీటి వనరులను సమర్థంగా ఎలా వినియోగించుకోవాలన్న దానిపై సమగ్ర ప్రణాళిక లేకపోవడం విచారకరం. ఇప్పటికీ రోడ్లు, విద్యుత్తు, పాఠశాలలు, నీళ్లు లేని గ్రామాలు ఉండటమేంది? దేశంలో నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తున్నది. -కేటీఆర్
మన పిల్లలు చదవుకోడానికి అమెరికా వెళ్లాల్సిన అవసరం ఎందుకు రావాలి? ఇకడే ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు ఎందుకు ఉండకూడదు? ఐఐటీలు, ఐఐఎంల వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఏర్పాటు చేసినా అవకాశాల కోసం దేశంలోని ప్రతిభావంతులైన యువత విదేశాలకు వెళ్తూనే ఉన్నది. దేశంలోనే ప్రపంచస్థాయి విద్య, ఉపాధి, పరిశోధన, వ్యాపార అవకాశాలు కల్పించి ప్రతిభావంతులను బయటకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నది. -కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 18 గంటలు పనిచేస్తున్నానంటున్నడు. కానీ ఆ సమయాన్నంతా తన అన్నదమ్ములకు రాష్ట్రాన్ని దోచిపెట్టడానికే వాడుతున్నడు. కొండల్రెడ్డికి కొండలు ఎట్లా కట్టబెట్టాలె? తిరుపతిరెడ్డికి ఎలా భూములు ధారాదత్తం చేయాలె? అనే ఆలోచన తప్ప తెలంగాణ ప్రజల గురించి సీఎంకు సోయి లేదు. -కేటీఆర్