Polytechnic : యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విలీనం ప్రతిపాదనపై కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. జీవో 97ను నిరసిస్తూ విద్యార్థి లోకం నిర్వహించిన 37 రోజుల ఉద్యమంతో సర్కార్ దిగొచ్చింది. దాంతో, వీలీనం నిర్ణయానికి బ్రేక్ పడింది. శక్తి శాఖలో ఉద్యోగుల కేటాయింపు విషయం కూడా ఇక్కడితో ముగిసినట్టే.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విలీనం కోసం జూలై 3వ తేదీన విడుదల చేసిన 97 జీవోపై విద్యార్థి, అధ్యాపక లోకం భగ్గుమనడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. శక్తి శాఖలో ఉద్యోగుల కేటాయింపు అంశంపై కూడా తీవ్ర నిరసను వ్యక్తమవ్వడంతో.. కేకే కమిటీ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందించింది.
దాంతో, పాలిటెక్నిక్ విలీనం ప్రతిపాదనపై సర్కార్ యూటర్న్ తీసుకుంది. కాబట్టి పాత పద్ధతిలోనే డిప్లొమా విద్య.. సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కాలేజీల కొనసాగనున్నాయి. అలానే సాంకేతిక విద్యామండలి, ఏఐసీటీఈ విధానాలు యథాతథంగా ఉండనున్నాయి. దాంతో, 37 రోజుల విద్యార్థులు, అధ్యాపకుల పోరాటానికి ఫలితం దక్కింది.