Badminton | చెంగ్డూ: బ్యాడ్మింటన్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన థామస్, ఉబర్ కప్ ఫైనల్స్కు శనివారం నుంచి తెరలేవనుంది. చెంగ్డూ వేదికగా ఈ మెగా టోర్నీలు మొదలుకానున్నాయి. రెండేండ్ల క్రితం ‘థామస్ కప్’లో 14 సార్లు విజేత ఇండోనేషియాను మట్టికరిపించిన భారత్ చాంపియన్గా అవతరించి కొత్త చరిత్ర సృష్టించింది.
ఏప్రిల్ 27 నుంచి మే 4 దాకా జరుగబోయే ఈ టోర్నీలలో థామస్ కప్నకు గత చాంపియన్ జట్టే బరిలోకి దిగుతుండగా ఉబర్ కప్లో మాత్రం భారత స్టార్ షట్లర్ పీవీ సింధుతో పాటు సీనియర్ ప్లేయర్లు లేకుండానే యువ భారత్ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.