కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 26 : పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు హెచ్చరించారు. లక్ష్మీదేవిపల్లి మండలం ఇల్లెందు క్రాస్రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అక్రమంగా నగదు, మద్యం తరలించే అవకాశం ఉన్నందున ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ఎస్పీ వెంట ట్రైనీ ఐపీఎస్ విక్రమ్ సింగ్, చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవిపల్లి ఎస్సై గన్రెడ్డి రమణారెడ్డి ఉన్నారు.