MLA revuri prakash reddy | పరకాల పట్టణంలో భూముల అక్రమ ఆక్రమణపై సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వినతిపత్రాన్ని అందజేశారు. పరకాల పట్టణంలోని సర్వే నంబర్లు 682, 683, 698, 195, 637, 640, 648, 750, 751, 752, 746, 749, 779లలో సుమారు 50 ఎకరాల భూమి అక్రమ ఆక్రమణకు గురైనట్లు వార్తాపత్రికలలో వచ్చిన వార్తలపై సమగ్ర విచారణ జరిపించాలని బుధవారం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ని కలిసి విజ్ఞప్తి చేశారు.
నకిలీ/కల్పిత పత్రాలతో భూముల ఆక్రమణకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, సంబంధిత రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కలెక్టర్ను కోరారు. ఆరోపణలు నిజమని నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోని బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
Harish Rao | సాగునీటి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన హరీశ్ రావు
Lok Sabha: లోక్సభలో 4 బిల్లులు.. సభ 2 గంటల వరకు వాయిదా
TN Assembly | తమిళనాడులో రాష్ట్ర గీతానికి పెద్దపీట.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం