న్యూఢిల్లీ: కరోనా రెండోవేవ్లో వ్యాపారాలు దెబ్బతిని బ్యాంకులకు రుణాలు చెల్లించలేని చిన్న వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురందించింది. వారికి ది ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం (ఈసీఎల్జీఎస్) అందుబాటులోకి తెచ్చింది.
ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి నాలుగుసార్లు కేంద్రం విస్తరించింది. కనుక దీన్ని ఈసీఎల్జీఎస్ 4.0గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ పథకంలో ఉన్న రూ.500 కోట్ల రుణ పరిమితిని కూడా తొలగించి వేసింది.
వ్యాపారులు తాము బ్యాంకుల్లో తీసుకున్న రుణాల్లో 40 శాతం గానీ, రూ.200 కోట్లు అదనంగా గానీ తీసుకోవచ్చు. ఈసీఎల్జీఎస్ 1.0 అర్హులైన వారు మరో 10 శాతం రుణం తీసుకునే వెసులుబాటు కేంద్రం కల్పించింది.
తాజాగా కేంద్రం తీసుకొచ్చిన మార్పుల్లో భాగంగా దవాఖానలు, నర్సింగ్ హోంల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి, ఎంఎస్ఎంఈ రుణాల పునర్వ్యవస్థీకరణ, పౌర విమానయాన శాఖలకు ఈ పథకాన్ని విస్తరించింది.
అంతే కాదు.. ఈ స్కీం గడువు సెప్టెంబర్ నెలాఖరు నుంచి డిసెంబర్ వరకు పొడిగించింది. ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు దవాఖానలు తీసుకునే రూ.2 కోట్ల రుణాల వరకు ఇది వర్తిస్తుంది. ఈ రుణాలపై వడ్డీ 7.5 శాతం లోపే ఉంటుంది.
అక్కెరకురాని ముచ్చట్లతో లాభం లేదు.. ప్రధాని మన్ కీ బాత్పై రాహుల్గాంధీ ఫైర్
ప్రియుడితో కలిసి సొంతింట్లోనే యువతి దొంగతనం
ఈఎస్ఐసీ ద్వారా ఫ్యామిలీ పెన్షన్…
IPL 2021: ఐపీఎల్ కోసం సీపీఎల్ షెడ్యూల్ మార్పు
మార్స్పై మేఘాలను చూశారా.. క్యూరియాసిటీ పంపిన అద్భుతమైన ఫొటోలు
బుల్లెట్ బైక్ కోసం వరుడి డిమాండ్.. ఊహించని షాక్ ఇచ్చిన వధువు
మళ్లీ రాజకీయాల్లోకి వస్తా.. పార్టీని గాడిలో పెడతా!
ప్రియుడితో కలిసి సొంతింట్లోనే యువతి దొంగతనం
బుల్లెట్ బైక్ కోసం వరుడి డిమాండ్.. ఊహించని షాక్ ఇచ్చిన వధువు
పీపీఈ కిట్ వేసుకొని.. కొవిడ్ పేషెంట్ మృతదేహాన్ని నదిలో పడేస్తూ.. షాకింగ్ వీడియో