ఐపీఎల్ 2021 రెండోదశను సజావుగా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని చర్యలు తీసుకుంటున్నది.
ఐపీఎల్ సెకండాఫ్ జరుగుతున్న సమయంలో మరే ఇతర కారణాల వల్ల విదేశీ ఆటగాళ్లు దూరం కాకుండా ఆయా బోర్డులతో బీసీసీఐ చర్చలు జరుపుతోంది.
కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) ఆగస్టు 28న ప్రారంభంకాగా సెప్టెంబర్ 19న పైనల్ జరగనుంది. ఐపీఎల్లోని మిగతా మ్యాచ్లను సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 10 వరకు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. దీంతో సీపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడేందుకు కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో పాటు లీగ్లో కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడేది అనుమానంగా మారింది.
సీపీఎల్ రీషెడ్యూల్ కోసం బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే వెస్టిండీస్ బోర్డుతో చర్చలు జరుపుతోంది. ‘క్రికెట్ వెస్టిండీస్తో చర్చలు జరుపుతున్నాము. సీపీఎల్ను కొన్ని రోజుల ముందుగానే పూర్తి చేయగలిగితే, బయో బబుల్ నుంచి దుబాయ్లోని మరో బయో బబుల్కు ఆటగాళ్లను బదిలీ చేయడానికి సులువు అవుతుంది. తో నిర్ణీత సమయంలో ఆటగాళ్లను మూడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ను పూర్తి చేయడానికి సహాయపడుతుందని’ బీసీసీఐ అధికారి తెలిపారు.