(Cold waves) విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సాధారణం కంటే సగటున 2 నుంచి 4 డిగ్రీలు తగ్గడంతో రాష్ట్రం చలికి వణికిపోతున్నది. మరో మూడు రోజులు చలిగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ చలిగాలుల మధ్య ఉక్కిరిబిక్కిరవుతున్నది. గత రెండు రోజులుగా చలిగాలులు వీస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతాలే కాకుండా నగరాలు, సముద్ర తీర ప్రాంతాలు గజగజలాడుతున్నాయి. సాధారణం కంటే 2-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సమయంలో సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 22 డిగ్రీల వరకు ఉంటాయి. సముద్ర మట్టానికి 18 కి.మీ ఎత్తులో తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు వీచడంతో చలిగాలులు తీవ్రరూపం దాల్చాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న వారం రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నదని, రానున్న 15 రోజుల పాటు దీని ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొన్నది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. కాగా, విశాఖ చింతపల్లిలో శనివారం కనిష్ట ఉష్ణోగ్రత 5.6 డిగ్రీలుగా నమోదైంది.
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..