(Narayana swamy) చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని అంతం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. నాయుడుపై తీవ్రవాదిగా అభియోగాలు మోపారు. అలాగే, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులను చంపేందుకు చంద్రబాబు సామాజిక వర్గం చందాలు పోగు చేసుకుంటున్నదని నారాయణస్వామి ఆరోపించారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉన్నదని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆరోపించారు. జగన్కు రక్షణ కల్పించేందుకు వైసీపీ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జగన్ను అంతం చేసేందుకు చంద్రబాబు పన్నుతున్న కుట్రలను వైసీపీ కార్యకర్తలు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని, సమయం వచ్చినప్పుడు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలను సూచించారు. చిత్తూరు జెడ్పీ జనరల్ బాడీ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జెడ్పీ మీటింగ్కు మరో మంత్రి పీ రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. సభకు జెడ్పీ చైర్మన్ జీ శ్రీనివాసులు అధ్యక్షత వహించగా.. కలెక్టర్ ఎం హరినారాయణన్, వైసీపీ శాసనసభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.
చర్మ క్యాన్సర్ ఎందుకు వస్తుందో కారణం తెలిసిపోయింది!
సోరియాసిస్ బాధితులకు గుడ్న్యూస్.. శాశ్వత పరిష్కారం దొరికినట్టే
నొప్పి లేని, మచ్చ రాని వీనోట్స్ సర్జరీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..