CP Sajjanar : హైదరాబాద్లో వరసగా మూడో రోజు భారీ వర్షం కురిసింది. వాన దంచకొట్టడంతో నగరంలోని రోడ్లు, పలు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. దాంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు నిలిచిన చోట ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రమాదాలకు అస్కారం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని, అత్యవసర సాయానికి 100కు డయల్ చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (CP Sajjanar) కోరారు.
రాష్ట్ర రాజధానిలో వర్షం దంచికొట్టింది. నగరంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, అల్వాల్, అమీర్పేట, హైటెక్ సిటీ, ఐకియా, మాదాపూర్, కేపీహెచ్బీ, చాదర్ఘట్, మలక్పేట, కార్కానా, తిరుమలగిరిలో వాన జోరుగా పడింది. దాంతో, ఆఫీసులో విధులు ముగించుకొని ఇళ్లకు బయల్దేరిన వాహనదారులు ట్రాఫిక్లో ఇరుక్కున్నారు. రోడ్లపై వాన నీరు భారీగా చేరడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
#HYDTPinfo
🚨 RAIN ALERTDue to heavy rainfall, waterlogging has been reported at RUB S.R. Nagar, resulting in slow-moving traffic in the area.
👮 Traffic Police are on-site regulating traffic to facilitate smoother vehicular movement.
⚠️ Commuters are advised to drive… pic.twitter.com/uwVxsvEv9M
— Hyderabad Traffic Police (@HYDTP) July 28, 2026
మాదాపూర్ – కేపీహెచ్బీ దారిలో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. అలానే.. కార్ఖానా – తిరుమలగిరిలోని రాజీవ్ రహదారి జలమయమైంది. దాంతో, వాహనదారులను వేరే మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే 100కు డయల్ చేయాలని కోరారు. ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ స్వయంగా పలు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షం తీవ్రత దృష్ట్యా అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని ఆయన హెచ్చరించారు.
#Hyderabad #trafficpolice on #highalert amid #heavyrains @HYDTP Joint CP Joel Davis, IPS, along with DCP Traffic-I Avinash Kumar, IPS, DCP Traffic-II Kajal Singh, IPS, and DCP Traffic-III Rahul Hegde, IPS, conducted field inspections on Tuesday at major #waterlogging points,… pic.twitter.com/lPJh27fsAu
— NewsMeter (@NewsMeter_In) July 28, 2026