(Street Vendors) హైదరాబాద్: రాష్ట్రంలోని వీధి వ్యాపారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. దాదాపు 69 వేల మంది వీధి వ్యాపారులకు రేషన్ కార్డులను అందించడమే కాకుండా వారికి వివిధ ప్రభుత్వ పథకాలు అందేలా చూడగలిగింది. రాష్ట్రంలోని తొమ్మిది నగరాలు, పట్టణాల్లోని వీధి వ్యాపారులపై కుటుంబ సర్వే చేసి అర్హులైన పథకాలను వారికి వర్తించేలా చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ విధానాలపై వీధి వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చాలా మంది వీధి వ్యాపారులకు ప్రభుత్వ పథకాల గురించి అవగాహన లేకపోవడం, ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక అర్హత ఉన్న వారు కూడా దూరమవుతున్నారు. ఇలాంటివారిని గుర్తించేందుకు వీధి వ్యాపారుల కుటుంబాలపై ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించింది. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మెప్మా అధికారులు సర్వే చేపట్టారు. వారి కుటుంబాల సమాచారం సేకరించడం ద్వారా వారికి అర్హత గల పథకాలను అన్నింటినీ వర్తింపజేసేలా చూశారు. పట్టణ ప్రగతిలో భాగంగా వీధి వ్యాపారులకు చేయూత అందించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. వారికి రుణాలు అందించడం, షాపులు పెట్టుకోవడానికి షెడ్లు నిర్మించి ఇస్తున్నారు.
జీహెచ్ఎంసీ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, రామగుండం, ఆదిలాబాద్, ఖమ్మం, సూర్యాపేట పట్టణాల్లోని వీధి వ్యాపారుల కుటుంబాలపై సర్వే నిర్వహించారు. ఈ పట్టణాల్లో 1.03 లక్షల వీధి వ్యాపారుల కుటుంబాలు ఉన్నట్లు సర్వేలో తేల్చారు. ఆయా కుటుంబాల్లో ప్రభుత్వ పథకాలకు అర్హులై ఉండి ఇప్పటివరకు వాటిని పొందని వారిని దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. దాదాపు 69,315 తెల్లరేషన్ కార్డులను అందించి ప్రతి నెలా రేషన్ బియ్యాన్ని పొందేలా చూస్తున్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి శ్రమ్యోగి మన్దన్ యోజన.. ఇలా పలు పథకాలపై అవగాహన కల్పించి వారికి వర్తించేలా చేయగలిగారు.
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..