ఐటీఐ ప్రాంగణంలో నిర్మిస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి సదుపాయాలను సిద్ధం చేసి ఉంచాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ మూడో రోజుకు చేరుకుంది.
కాలనీల్లో ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా సత్వర చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులకు సూచించారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగానే తమ రెండు నెలల కుమారుడు ఆక్సిజన్ అందక మృతి చెందినట్లు ఆరోపిస్తూ కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టిన ఘటన ఎంజీఎం హాస్పిటల్ పీడియాట్రిక్ వార్డులో చోటుచేసుకుంది.
శాస్త్రీయ పద్ధతుల ద్వారా డెయిరీ సాగు చేపడితే అధిక లాభాలు పొందే అవకాశం ఉందని పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ కొండల్రెడ్డి అన్నారు.