హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ర్ట సాధకుడు కేసీఆర్ జన్మదిన వేడుకలను కేయూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్వీ కేయూ ఇంచార్జి జెట్టి రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ..రాష్ర్టం కోసం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను, 62 ఏళ్ల కలను సాకారం చేయడమే కాకుండా, తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ర్ట ముఖచిత్రాన్ని మార్చారని వారు గుర్తుచేశారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తూ మౌలిక సదుపాయాల కల్పన, అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారని కొనియాడారు.
తెలంగాణ ప్రజల కలలు సాకారం కావాలంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని వారు ఆకాంక్షించారు. భగవంతుడి ఆశీర్వాదంతో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్చంద్ర, యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్, యూనివర్సిటీ బీఆర్ఎస్వీ నాయకులు కందికొండ తిరుపతి, గొల్లపల్లి వీరు, పిన్నింటి విజయ్కుమార్, పస్తం అనిల్, మహేష్, ఇస్మాయిల్, కార్తీక్, నల్లతీగల శ్రీకాంత్, సాయికుమార్, శివ, సాయి, వేణు, అఖిల్, అజయ్, పవన్ పాల్గొన్నారు.