ఊట్కూర్, ఫిబ్రవరి17: తెలంగాణ సాధకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం అవసలోని పల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, గ్రామస్తులు కేకు ను కట్ చేసి మాజీ సీఎం కేసీఆర్ కు బర్త్డే విషెస్ తెలిపారు. గ్రామ సర్పంచ్ దాసరి ఎల్లమ్మ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదేళ్ల పాలన యావత్ భారతదేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
కేసీఆర్ చూపిన బాటలో గ్రామ సీమలను అభివృద్ధి చేసుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, పెద్ద బాలప్ప, తిమ్మయ్య, రాందేశాయ్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మల్లప్ప, నాగేష్, యువ నాయకులు శ్రీనివాస్, ప్రకాష్, లక్ష్మణ్, వెంకటేష్, వెంకటేశ్వర్ రెడ్డి, లడ్డు, రాము, రాజు పాల్గొన్నారు.