జూలపల్లి, ఫిబ్రవరి 17 : ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో శ్రీ రావుల మల్లికార్జున స్వామి ఆలయంలో కేసీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ మరెన్నో జన్మదిన వేడుకలు నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రఘువీర్ సింగ్ నేనున్నా స్వచ్ఛంద సేవా సమితి తరపున రూ. 50 వేల చెక్కును యాదవ సంఘం సభ్యులకు అందజేశారు.
ఈ క్రమంలో యాదవ కులస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తొగరు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వీసారపు వెంకటేశం, మాజీ వైస్ ఎంపీపీ మొగురం రమేష్, సర్పంచులు సూర ప్రభుదాస్, మెండె తిరుపతి, మాజీ ఎంపీటీసీ తమ్మడవేణి మల్లేశం, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కొండపల్లి కృష్ణమూర్తి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సంకెండ్ల లక్ష్మణ్, జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు పొట్టాల మల్లేశం, యాదవ సంఘం అధ్యక్షుడు ఆవుల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.