DEECET | హనుమకొండ చౌరస్తా, మార్చి 7: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) లో ప్రవేశాలకు డీఈఈసెట్ –
2026 నోటిఫికేషన్ విడుదల చేయబడిందని హనుమకొండ జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రధానాచార్యులు బి.రంగయ్యనాయుడు తెలిపారు.
తెలంగాణలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ, ప్రైవేట్ డీఈడీ కాలేజీల్లో 2026-2027 విద్యాసంవత్సరానికి ఈ ఈ కోర్సులు చేసేందుకు డీఈఈసెట్-2026 ద్వారా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఆన్లైన్ విధానంలో ప్రవేశ పరీక్ష మే 21,22వ తేదీల్లో నిర్వహించబడుతుందన్నారు. ఇంటర్మీడియట్లో 50 శాతం ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు, 45 శాతం ఉతీర్ణత సాధించిన ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్ ద్వారా రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు రూ.450 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
పూర్తి వివరాల కోసం https://deecet.cdse.telangana.gov.in వెబ్సైట్ను పరిశీలించాలని.. ఏవైనా సందేహాలు ఉంటే 8317567404 హెల్ప్లైన్ నెంబర్ను సంప్రదించాలని కోరారు.