ATM theft : సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఏటీఎంలో చోరీ జరిగింది. జిన్నారం మండలం గడ్డపోతారంలో ఉన్న ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రూ.1.60 లక్షలు దోచుకెళ్లారు. గడ్డపోతారంలోని పోచమ్మ ఆలయం పక్కనగల కొటక్ మహీంద్రా బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు.
ఏటీఎంను విరగగొట్టి ఉండటాన్ని శనివారం తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు ఐడీఏ బొల్లారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏటీఎంను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.