Musi Victim | ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే.. మాట్లాడుతుంటేనే బాధనిపిస్తుందని మూసీ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సదరు బాధితురాలు మాట్లాడుతూ.. మొన్న ఖమ్మంలో కూడా చూసినం.. ఒక్కొక్కొరైతే కాళ్లు పాయె, చేతులు పాయె అని ఏడిస్తే కూడా మనిషివేనా నువ్వు.. ప్రజల గురించి ఎందుకు ఆలోచించడం లేదు. ప్రజల బాధలు ఎందుకు అర్థం చేసుకుంటలేవు. నువ్వు అర్థం చేసుకునేదాక మా పోరాటం ఆగదని స్పష్టం చేసింది.
రేవంత్ రెడ్డి అసలు మనిషేనా..? మనిషి జన్మ పుట్టలేదా..? రేవంత్ రెడ్డి కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడు.. ప్రజల బాధ అర్థం చేసుకోవడం లేదని మండిపడ్డది. బస్తీల మహిళలంతా ఏకమైతరు.. ఇప్పటికే రోడ్లపైకి వచ్చేసినం. ఇప్పుడు కూడా వస్తం.. ఇంకా రోడ్డుపై వచ్చి నువ్వు దిగేదాకా కష్టపడతాం. ఎందుకంటే మేము కూడా 30 ఏండ్ల నుంచి ఏగిస్తనే ఉన్నం. ఇవన్నీ తీసేస్తం.. అని చెప్తున్నరు. కానీ వాళ్లు కష్టం చేసిన కట్టుకున్న డబ్బులు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇయ్యలే. వాళ్ల కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కట్టుకున్న ఇండ్లను కూల్చేస్తమంటే ఎవరు ఊరుకుంటరు.
మా పైసలతోనే నువ్వు పెద్ద జీతం తింటున్నవ్. మా పైసలతోని ఇంట్ల ఉంటున్నవ్. నీకో 500 గజాల ఇల్లుంది.. నీ భార్య, బిడ్డ బతుకుతుంది. ఇయ్యాళ నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నవ్..అందరి కుటుంబాల గురించి ఎందుకు ఆలోచిస్తలేవు. ఆలోచించాలి.. లేకుంటే నువ్వు మళ్లా దిగుతవ్ బిడ్డా.. చూసుకో జాగ్రత్త అని హెచ్చరించింది.
రేవంత్ రెడ్డి అసలు మనిషేనా? మనిషి జన్మ పుట్టలేదా?
రేవంత్ రెడ్డి కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడు.. ప్రజల బాధ అర్థం చేసుకోవడం లేదు
మహిళలందరం కలిసి రోడ్ల మీదకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ నుండు దిగిపోయేవరకు పోరాటం చేస్తాం – మూసీ బాధితురాలు pic.twitter.com/kPC1TyeJYG
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2026