చండీగఢ్ : హర్యానాలో మనసులు కలిచివేసే ఘటన జరిగింది. సోనీపట్కు చెందిన శివ్చరణ్ గుప్తా తన ముగ్గురు కూతుర్లను చదివించడానికి జీవితమంతా కష్టపడ్డాడు. అందులో ఇద్దరికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. కానీ శివ్చరణ్ కు వయసైపోయాక ఎవరూ పట్టించుకోకపోవడంతో వృద్ధాశ్రమంలో చేరాడు. చివరికి అనారోగ్యంతో మరణించినా ముగ్గురు కూతుర్లలో ఒక్కరు కూడా చూడటానికి రాలేదు. వృద్ధాశ్రమ నిర్వాహకుడు ఆనంద్ కుమార్కు రూ.5,100 పంపించి అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పారు. తండ్రి దహన సంస్కారాలను వారు ముగ్గురూ వీడియో కాల్లో చూశారు. కూతుర్లను చూడాలనే చివరి కోరిక తీరకుండానే శివ్చరణ్ చనిపోయాడని ఆనంద్ తెలిపారు. చనిపోయిన తర్వాతైనా వారు వస్తారని తాము ఆశించామని.. సమాచారం ఇచ్చినా వారు రాలేదని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తండ్రి జీవితాన్ని త్యాగం చేసి చదివిస్తే కనీసం అంత్యక్రియలకు కూడా రారా అంటూ అనేకమంది తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.