ముంబై, ఆగస్టు 5 : దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనయ్యాయి. వరుసగా నాలుగోసారి రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం మార్కెట్ వర్గాలను రుచించలేదు. ఒక దశలో 800 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 152 పాయింట్లు అందుకొని 78,581 వద్ద ముగిసింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 9.75 పాయింట్లు అందుకొని 24,624.65 వద్ద నిలిచింది.
బ్లూచిప్ సంస్థల షేర్లతోపాటు బ్యాంకింగ్, వాహన, క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభాల్లోకి రావడం కలిసొచ్చింది. అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగియగా..టీసీఎస్, హెచ్సీఎల్, రిలయన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టపోయాయి.