ముంబై, ఆగస్టు 5 : ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త స్కార్పియో-ఎన్ మాడల్ను మార్కెట్కు పరిచయం చేసింది. అడ్వాన్స్డ్ ఫీచర్సతో తీర్చిదిద్దిన ఈ కారు రూ.13.29 లక్షల ప్రారంభ ధర, కాగా, గరిష్ఠ ధర రూ.23.80 లక్షలుగా నిర్ణయించింది.
పెట్రోల్, డీజిల్ ఇంజిన్తో రూపొందించిన ఈ కారులో పానోరమిక్ స్కైరూట్, 540 డిగ్రీల సరౌండింగ్ సిస్టమ్, 31.24 సెంటిమీటర్ల హెచ్డీ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 26. 03 సెంటిమీటర్ల హెచ్డీ డిజిటల్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో/కార్ ప్లే, పలు ఎయిర్బ్యాగ్లు, వైర్లెస్ చార్జింగ్ పాయింట్ వంటి ఫీచర్స్తో తీర్చిదిద్దింది.