పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. మున్సిపాలిటీలో మొత్తం15 కౌన్సిలర్ స్థానాలు ఉండగా 11 కాంగ్రెస్, 1బీఆర్ఎస్, 1ఏఐఎఫ్ బీ విజయం సాధించింది. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్కు కేటాయించగా.. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత బిరుదు రాజమల్లు కుమారుడు బిరుదు రాధాకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ సతీమణి అంతటి పుష్పలత, మున్సిపల్ మాజీ చైర్మన్ గాజుల లక్ష్మి భర్త గాజుల రాజమల్లు పోటీపడ్డారు.
వీరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ శిబిరం నుంచి ఎవరు హాజరు కాలేదు. దీంతో చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.