జాతీయ స్థాయిలో మరో తెలంగాణ యువ క్రికెటర్ రివ్వున దూసుకొచ్చింది. ప్రతిభను నమ్ముకుంటూ, అవకాశాలను అందిపుచ్చుకుంటూ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నది. సోదరున్ని స్ఫూర్తిగా తీసుకుంటూ ఎనిమిదేండ్ల �
ఇంగ్లండ్తో జరగనున్న మూడో టెస్టుకు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. గాయం నుంచి రాహుల్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని తప్పిస్తున్నట్లు బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
భారత సీనియర్ క్రికెటర్ సౌరభ్ తివారీ ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఈ నెల 16 నుంచి రాజస్థాన్తో మ్యాచ్ అనంతరం వీడ్కోలు పలకనున్నట్లు వెల్లడించాడు.
హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ సీజన్-4లో టీమ్ అల్ఫా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో టీమ్ అల్ఫా 45-35తో రఫ్ రైడర్స్పై అద్భుత విజయం సాధించింది.
బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన శ్రీలంక.. అఫ్గానిస్థాన్పై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో లంక 155 పరుగుల తేడాతో అఫ్గాన్ను చిత్తుచేసింది.
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యువ భారత జట్టు.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించగా.. గురువారం జరిగిన రెండో సెమీస్లో పాకిస్థాన్పై ఆస్ట్రేలియా గెలుపొందింది.
ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్తో పాటు అరుంధతి చౌదరీ టోర్నీలో కనీసం కాంస్య పతక�
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 281 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 529 పరుగుల లక్ష్యఛేదనలో సఫారీలు 247 పరుగులకే పరిమితమయ్యారు.