సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ : సనత్నగర్ నియోజకవర్గంలోని ఐడీహెచ్ డబుల్ బెడ్ర్రూం ఇండ్ల కాలనీలో పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు పార్కులను అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. బన్సీలాల్పేట డివిజన్లోని ఐడీహెచ్ డబుల్ బెడ్ర్రూం కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీలను కమిషనర్ మంగళవారం జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, హౌసింగ్ ఎండీ గౌతమ్తో కలిసి పర్యటించారు. కాలనీల్లో ఉన్న రెండు ఖాళీ స్థలాల్లో పిల్లల పార్కులను అభివృద్ధి చేయాలని సికింద్రాబాద్ జోనల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మంగతాయారు, ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఓటీఎస్ను సద్వినియోగం చేసుకోవాలి
ఆస్తిపన్ను బకాయిలను ఈనెల 31లోపు చెల్లిస్తే వడ్డీపై 90శాతం వరకు రాయితీ పొందే అవకాశం ఉందని, వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సూచించారు. ఆస్తిపన్నును జీహెచ్ఎంసీ పోర్టల్, మైక్యూర్ యాప్, మీసేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లలో సులభంగా చెల్లించవచ్చని తెలిపారు. ఇప్పటికే ఎఫ్ఎం రేడియోలు, బస్ షెల్టర్ల ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిల చెల్లింపులు, ఓటీఎస్పై విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.