Ponguleti Srinivas Reddy | కాంగ్రెస్ సర్కార్ అలవికాని హామీలిచ్చి అమలు చేయలేక గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాలమెల్లదీస్తుందని ప్రత్యేకించి చెప్పనసరం లేదు. కాంగ్రెస్ సర్కార్ పనితీరు ఎలా ఉందో తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ మరోసారి చెప్పకనే చెబుతున్నాయి. కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం తరపున ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నన్నీ ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి తీరుతామని అన్నారు. దీంతో పక్కన ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలగజేసుకొని పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి అబద్ధాలు చెప్తున్నారంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ కౌశిక్ రెడ్డి అప్పుల పేరుతో కాంగ్రెస్ తప్పించుకునే డ్రామాలు ఆపాలని పొంగులేటితో సభా వేదికపైనే కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ కౌశిక్ రెడ్డి
కేసీఆర్ చేసిన అప్పుల వల్ల పథకాలు ఇవ్వడంలేదని చెప్పిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
వెంటనే లేచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి అబద్ధాలు చెప్తున్నారంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మండిపడ్డ కౌశిక్ రెడ్డి
అప్పుల పేరుతో… pic.twitter.com/MTemFVK5S9
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2026
Harish Rao | సాగునీటి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన హరీశ్ రావు
Lok Sabha: లోక్సభలో 4 బిల్లులు.. సభ 2 గంటల వరకు వాయిదా
TN Assembly | తమిళనాడులో రాష్ట్ర గీతానికి పెద్దపీట.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం