ప్రధాని మోదీ ఓ ర్యాలీలో పాల్గొనడానికి ముందు నకిలీ సైనికుడొకరిని గుర్తించారు. గార్డ్స్ రెజిమెంట్ నాయక్ అని చెప్పిన రామేశ్వర్ మిశ్రాను అదుపులోకి తీసుకుని ముంబై పోలీసులు విచారిస్తున్నారు.
జార్ఖండ్లోని గొడ్డా ప్రాంతంలో జరపతలపెట్టిన బొగ్గు తవ్వకాలను ఆదివాసీలు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. పోలీసులు లాఠీ చార్జ్ చేయగా.. ఆదివాసీలు బాణాలతో దాడికి పాల్పడ్డారు.
ఉత్తర భారతదేశం చలిగాలుల గుప్పిట్లో గజగజలాడుతున్నది. ఢిల్లీ, కాన్పూర్లో గత చలిగాలుల రికార్డులు బద్దలయ్యాయి. యూపీ, ఉత్తరాఖండ్లో వానలు పడే సూచనలున్నాయి.
SGPC Dhami | మొహలీలో ఎస్జీపీసీ చీఫ్ ధామి కారుపై అటాక్ జరిగింది. సిక్కు ఖైదీలను విడుదల చేయాలంటూ ఆందోళన చేస్తున్న వారు ధామి కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు.
Baby jain monk | సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి మనవరాలు దేవాన్షీ జైన సన్యాస దీక్ష చేపట్టింది. వేల మంది సమక్షంలో ఈ 9 ఏండ్ల చిన్నారి జైన సన్యానిగా మారింది. చిన్నారి తల్లిదండ్రులు అదృష్టంగా భావిస్తున్నారు.
Currency in Assembly | మాఫియా చేస్తున్న ఉద్యోగ నియామకాలపై నోరెత్తకుండా ఉండేందుకు తనకు లంచం ఇచ్చారని ఆప్ ఎమ్మెల్యే ఆరోపించారు. రూ.15 లక్షల నోట్ల కట్టలను అసెంబ్లీకి తెచ్చి ప్రదర్శించారు.
Land sinking | జోషీమఠ్ దృశ్యాలు ఇప్పుడు హిమాచల్లోని మండీ జిల్లాలో కనిపిస్తున్నాయి. మండీ జిల్లాలోని మూడు గ్రామాల్లో భూమి కుంగిపోయింది. 32 ఇళ్లలో పగుళ్లు ఏర్పడటంతో ప్రజలు భయపడిపోతున్నారు.
Chandigarh Mayor | చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో మూడు ముఖ్య పదవులను బీజేపీ మరోసారి దక్కించుకున్నది. కాంగ్రెస్లో గెలిచి పార్టీ మారిన ఇద్దరు సభ్యులతో బీజేపీ బలం పెంచుకున్నది.
Sikkim Increment | సిక్కింలో జనాభా పెంచేందుకు ఆ రాష్ట్ర సీఎం ప్రోత్సాహకాలు ప్రకటించారు. పిల్లల్ని కనే ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చేందుకు రూ.3 లక్షలు సాయం చేస్తారు.
Minister Apology | డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల పనితీరు మధ్యప్రదేశ్లో బయటపడింది. రోడ్లు అధ్వానంగా ఉండటంతో బురదలో నడిచిన వ్యక్తి కాళ్లు కడిగిన మంత్రివర్యులు.. అక్కడి ప్రజలను క్షమాపణలు కోరారు.
Gujarat Farmula | కర్ణాటకలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ఫార్ములా అనుసరించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇక్కడ ముఖ్యమంత్రిని మార్చి యెడ్యూరప్ప సామాజికవర్గాన్ని దగ్గరకు తీసుకునే పనిలో బీజేపీ ఉన్నది.
Ganga Vilas cruise | అట్టహాసంగా మొదలైన గంగా విలాస్ క్రూయిజ్ ప్రయాణం బిహార్ ఛాప్రలో నిలిచిపోయింది. గంగా నదిలో నీరు లోతు తక్కువగా ఉండటంతో చిక్కుకుపోయింది. ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి అండగా నిలిచింది.