క్రికెట్ గ్రౌండ్ను ప్రారంభించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి బీజేపీ నేత తల పగలగొట్టారు. సింధియా బంతిని దంచికొట్టగా క్యాచ్ పట్టేందుకు యత్నించిన నేత ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
తనను చంపేందుకు యూపీ బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ స్వామిప్రసాద్ మౌర్య ఆరోపించారు. సాధువుల రూపంలో ఉన్న నేరస్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లోక్సభ సెక్రటేరియట్ నోటీసుకు రాహుల్గాంధీ వివరణాత్మక సమాధానం ఇచ్చారు. అదానీ-మోదీల గురించి లోక్సభలో రాహుల్ వ్యాఖ్యానించగా.. ఎంపీల ఫిర్యాదు మేరకు నోటీసు ఇచ్చారు.
ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కర్ణాటక బీజేపీ చీఫ్ మరోసారి ప్రేలాపణలు చేశారు. టిప్పు సుల్తాన్ అనుచరులను చంపేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టిప్పు భజన చేసే వారిని అడవులకు తరిమికొట్టాలన్నా�
అసోం ప్రభుత్వం పత్రికల్లో ఇచ్చిన జ్యోతిర్లింగం ప్రకటన వివాదాస్పదమైంది. ఇదే ఆరో జ్యోతిర్లింగం అని అడ్వర్టైజ్మెంట్లో అక్కడి బీజేపీ పేర్కొన్నది. దీనిని ఎన్సీపీ, శివసేన థాక్రే వర్గం తీవ్రంగా వ్యతిరేక�
త్రీ ఇడియట్స్ సినిమాలో మాదిరిగా వాట్సాప్ వీడియో కాల్లో ఓ మహిళకు సీహెచ్సీ సిబ్బంది కాన్పు చేశారు. గైనకాలజిస్ట్ సూచనలు వింటూ 6 గంటల పాటు డెలివరీ చేశారు. ప్రస్తుతం తల్లీపాప ఆరోగ్యంగా ఉన్నారు.
జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ స్థానాల పెంపుదలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆర్టికల్ 370 రద్దు పిటిషన్ కోర్టు ముందు ఉండగా డీలిమిటేషన్పై విచారణ చేపట్టలేమని ధర్మాసనం తెలిపింది.
ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడని నెడుమారన్ బాంబు పేల్చాడు. ఆయన త్వరలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి తిరిగి ఈలం యుద్ధం చేస్తారని చెప్పాడు.
రాహుల్ గాంధీకి లోక్సభ సెక్రటేరియట్ నోటీసిచ్చింది. ఈ నెల 15 లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నది. లోక్సభలో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాలని సూచించింది.
భూకంపాలు వరుసగా సంభవిస్తూ మనల్ని భయపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట భూమి కంపిస్తూనే ఉన్నది. ఇవాళ ఉదయం అసోంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.0 గా ఉన్నది.
భారతదేశం ముస్లింల మాతృదేశమని, ఇతర ప్రాంతాల నుంచి ఈ మతం వచ్చిందని చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. భారత పౌరుల మధ్య వివక్ష ఉండకూడదనే తమ సంస్థ విధానమన్నారు.