Pakistan Loan | కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. గత ఐదేండ్లలో భారతదేశ రక్షణ బడ్జెట్ను దాదాపు రెట్టింపు చేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ప్రస్తుత బడ్జెట్లో రక్షణ మంత్రిత్వ శాఖకు రూ. 5.94 లక్షల కోట్లు కేటాయించింది. గత ఏడాది రూ.5.25 లక్షల కోట్ల నుంచి పెంచడం ద్వారా మరోసారి రక్షణ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించింది.
ఈ నేపథ్యంలో పొరుగు దేశమైన పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నది. దశాబ్దాల అధిక ద్రవ్యోల్బణం, తక్కువ జీడీపీ వృద్ధి, క్షీణిస్తున్న ఫారెక్స్ నిల్వలతో ఆ దేశం పోరాడుతున్నది. ఒకవైపు నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెడుతుండగా.. మరోవైపు పాకిస్తాన్కు సంబంధించిన నిబంధనల గురించి చర్చిస్తూ నెటిజెన్స్ జోక్స్ పేల్చారు.
‘భారత ప్రభుత్వ బడ్జెట్తో నిరాశ చెందాను. మాకు ఇచ్చే రుణం గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు – షాబాజ్ షరీఫ్’ అని ఒక ట్విట్టర్ వినియోగదారుడు రాశారు.
‘భారత్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయన్న విషయం పాకిస్తాన్కు ఈ రోజే తెలిసిందా..’ అంటూ మరో నెటిజెన్ కామెంట్ చేశాడు.
‘భారత్ బడ్జెట్ను మొత్తం పాకిస్తాన్ చూస్తోంది.. భారతదేశం ఇంత గొప్పగా ఎలా పని చేస్తోంది.. అన్లైన్ ట్యుటోరియిల్ మాదిరిగా ఉన్నది’ అని ఇంకో ట్విట్టర్ అకౌంట్లో రాశారు.
‘ఇండియ 2023 బడ్జెట్ ఫర్ గ్రోత్ (డాటా).. పాకిస్తాన్ 2023 బడ్జెట్ ఫర్ ఆటా..’ అని ఒకరు కామెంట్ చేశారు.