Blood letter | రామచరితమానస్పై చేసిన వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత హిందూ మహాసభ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు లేఖ రాసింది. ఎస్పీ నేతపై తక్షణమే చర్యలు తీసుకోకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హిందూ మహాసభ మధ్యప్రదేశ్ విభాగం ఉపాధ్యక్షుడు రాంబాబు సేన్ హెచ్చరించారు. ఈ లేఖను రక్తంతో రాసినట్లుగా తెలిసింది. రక్తంతో లేఖ రాయడంపై పలువురు విమర్శిస్తున్నారు.
రామచరితమానస్లోని కొన్ని భాగాలు జాతి, వర్ణ, వర్గ ప్రాతిపదికన సమాజాన్ని అవమానిస్తున్నాయని, వీటిని నిషేధించాలని సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు స్వామిప్రసాద్ మౌర్య డిమాండ్ చేశారు. దాంతో ఆయన తీవ్ర విమర్శలకు గురయ్యారు. దీనిపై హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్వామిప్రసాద్ మౌర్య నాలుకను కోసి తెచ్చిన వారికి రూ.51 వేల బహుమతిని అఖిల భారత హిందూ మహాసభ స్థానిక నాయకుడు ఒకరు ప్రకటించారు. ఈ నాయకుడిని తల నరికివేసి వారికి రూ.21 లక్షలు ఇస్తానని అయోధాలోని హనుమాన్గర్హి ఆలయ మహంత్ కూడా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో స్వామిప్రసాద్ మౌర్యపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలిండియా హిందూ మహాసభ మధ్యప్రదేశ్ విభాగం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్కు విజ్ఞప్తి చేసింది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా వారిని నిలువరించాలని కోరింది. ఈ మేరకు యూపీ సీఎంకు లేఖ రాసినట్లు రాంబాబు సేన్ తెలిపారు. అయితే, ఈ లేఖ రక్తంతో రాయడం కలకలం సృష్టించింది. అలా ముఖ్యమంత్రి రక్తంతో లేఖ రాయడం మన సంస్కృతి కాదని కొన్ని హిందూ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, లేఖను రక్తంతో రాసిన విషయాన్ని రాంబాబు సేన్ ధ్రువకరించ లేదు.