విద్యతోనే సమాజ మార్పు సాధ్యమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహేర్ బీన్ హందాన్ అన్నారు. పూలే దృష్టిలో నిజమైన స్వాతంత్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ కాదని సామాజిక స్వేచ్ఛ కూడా అని పేర్కొన్నారు.
నాలుగోసారి ఆడపిల్ల పుట్టడంతో 16 రోజుల పసికందును తల్లిదండ్రులు విక్రయించిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. బాన్సువాడ కేంద్రంగా జరిగిన ఈ ఘటన వివరాలను ఎస్హెచ్వో తుల శ్రీధర్ వెల్లడించారు.
పన్నుల వసూళ్లలో కామారెడ్డి బల్దియా వెనుకబడి పోయింది. ఒకప్పుడు రాష్ట్రంలోనే ముందుండే ఈ మున్సిపాలిటీ ఇప్పుడు అధమ స్థాయికి దిగజారింది. రెండేండ్లుగా బల్దియా పనితీరు అస్తవ్యస్తంగా మారిన తరుణంలో ఆ ప్రభావం వ
జామాబాద్ రూరల్ మండలంలోని మాధవ నగర్ గ్రామ నిరుపేద నివాసి రామస్వామి కామయ్యకు చెందిన ఐదు గేదెలు విద్యుదా ఘాతానికి గురై అక్కడికక్కడే అవి మృత్యువాత పడ్డాయి.
దేశంలో సామాజిక న్యాయ సాధనకు గొప్ప కృషి చేసిన సంఘ సంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించారు.
దుబాయ్ దేశంలోని ఓ కంపెనీలో ఇండియాలోని తెలంగాణ ప్రాంత నిజామాబాద్ రూరల్ మండలంలోని మారుమూల పల్లె అయిన లింగితండా కు చెందిన అబ్బాయి, శ్రీలంక దేశానికి చెందిన అమ్మాయి ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు.
పెద్దవాల్గోట్లో మండలంలో పెద్దవాల్గోట్ గ్రామంలో గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా ఘనంగా శోభయాత్ర నిర్వహించారు. పెద్దవాల్గోట్ గ్రామంలోని హనుమాన్ మందిరం నుండి శోభాయాత్ర ప్రారంభమైంది.
బ్రిటీష్ సామ్రాజ్య వాదాన్ని గడగడ లాడించిన విరయోధులు షహీద్ సర్దార్ భగత్ సింగ్-రాజ్ గురు-సుఖ్ దేవ్ల వర్ధంతి వారోత్సవాల్లో భాగంగా సీపీఐ(ఎం ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో 95వ వర్ధంతి మండల కేంద్రంలోని ఆశ్రమ
పిచ్చికుక్క దాడిలో పలువురు గాయాలపాలైన ఘటన సిరికొండ మండలంలో ని చిమన్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పిచ్చికుక్క వీధిలో తిరుగుతూ కనబడిన వారిపై దాడి చేసి గాయపరిచింది.
సిరికొండ మండలంలోని పందిమడుగు గ్రామానికి చెందిన రవి ట్రాక్టర్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. రవి రోజు లాగానే గురువారం సాయంత్రం తన పొలం వద్ద టాక్టర్ ఉంచి ఇంటికి వచ్చాడు.
నిజామాబాద్ జిల్లాలో పుష్కలంగా ఇంధన నిల్వలు ఉన్నాయని పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులు నమ్మ వద్దని ఆయన తెలిపారు.
సృజన టెక్ ఫెస్ట్ లో కోటగిరి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతి సాధించినట్లు కోటగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. ఈ మేరుకు ప్రతిభ కనబర్చిన విద్యార్థుల�