Kurnapalli | ఎడపల్లి : ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ ప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక హోమాలు, యజ్ఞాలు, పూజా కార్యక్రమాలు, మంగళ వాయిద్యాలతో శోభాయాత్రలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులంతా కలిసి ఉత్సవాలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్ గౌడ్, రమేష్ గౌడ్, మహేష్ గౌడ్, పరుశురాం గౌడ్, శ్రీనివాస్ గౌడ, గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.